గల్లీగల్లీల్లో క్రికెట్ ఆడటం ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారిపోయింది. గల్లీ క్రికెట్ నుంచి జాతీయ క్రికెట్ స్థాయికి ఎదిగిన వారు కూడా చాలా మందే వున్నారు. గల్లి నుంచి పాఠశాల, లీగ్ స్థాయి, జిల్లా, రాష్ట్ర, ఇలా చివరికి జాతీయ స్థాయిలోకి అగుడుపెట్టిన వారు కూడా వున్నారు. అయితే గల్లీ క్రికెట్ లో అడుతున్న సమయంలోనే చాలా కేర్ ఫుల్ గా వుండాలి. ఎందుకంటే అక్కడ ఎలాంటి నిబంధలను, కోడ్ లు వుండవు. ఎవరు ఎవరిపైనైనా తిరగబడతారు. స్పోర్టివ్ స్పిరిట్ అన్న మాటకు అర్థం కూడా తెలియని వయస్సు అది.
అందుకనే గల్లీ స్థాయిలో పిల్లలు అడేప్పుడు పెద్దలు పర్యవేక్షణ చాలా అవసరం. అలాంటి పర్యవేక్షణ లోపించిన పక్షంలో క్షణికావేశంలో జరిగే ఘర్షణలు ప్రాణాలను కూడా హరిస్తుంటాయి. అలా గల్లీ క్రికెట్లో 'నోబాల్' విషయమై జరిగిన గొడవ ఓ టీనేజ్ క్రికెటర్ ప్రాణాలను బలిగొన్నది. ఈ ఘటన బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో బుధవారం జరిగింది. 'నోబాల్' విషయమై వికెట్ కీపర్ గొడవకు దిగడంతో బ్యాట్స్మన్ అతన్ని వికెట్తో తలపై బాదాడు. దీంతో మైదానంలోనే ఆ యువకుడు కుప్పకూలాడు.
స్థానిక పోలీసు అధికారి భుయాన్ మహబూబ్ హసన్ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం స్నేహితులంతా కలిసి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుకుంటుడగా ఈ ఘటన జరిగింది. 16 ఏళ్ల బాబుల్ షిక్దర్ వికెట్ కీపర్గా ఉన్న సమయంలో బ్యాట్స్మన్ను ఎంపైర్ ఔట్గా ప్రకటించాడు. అయితే, బౌలర్ వేసిన బంతిని నోబాల్గా ప్రకటించి.. బ్యాట్స్మన్ను నాటౌట్గా డిక్లేర్ చేయాలని బాబుల్ షిక్దర్ ఎంపైర్తో గొడవకు దిగాడు. అంతకుముందు బంతిని కూడా ఇలాగే 'నోబాల్'గా ప్రకటించారు.
ఇలా మొదలైన గొడవ పెరిగి పెద్దదవ్వడంతో బ్యాట్స్మనే వికెట్ తీసుకొని షక్దర్ తలపై బాదాడు. దీంతో కుప్పకూలిన అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా ప్రాణాలు విడిచాడు. షక్దర్ను కొట్టిన బ్యాట్స్మన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, భారత్లో మాదిరిగానే దక్షిణాసియా దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలోనూ క్రికెట్ ఫీవర్ ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more