అందరిలాగా ఉంటే ఏముంటుంది కాస్త డిఫరెంట్ గా ఉంటేనే కదా కిక్ ఉండేది అని అనుకునే వాళ్లు చాలా మంది అమ్యజ్ మెంట్ పార్కుల్లో తమ ప్రతిభను చూపిస్తుంటారు. అక్కడి గేమ్స్ లో పాల్గొని ధ్రిల్ ఫీలవుతుంటారు. కానీ అలాంటి గేమ్స్ లో అనుకోకుండా ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. తాజాగా అలాంటి ప్రమాదం చెన్నైలో చోటుచేసుకుంది. చెన్నై శివార్లలోని కిష్కంధ ఎమ్యూజ్ మెంట్ పార్కులో కొత్తగా డిస్కో జాయింట్ వీల్ ను ఇలాగే ఏర్పాటు చేశారు. ఈ డిస్కో జాయింట్ వీల్ కుప్పకూలిపోయి ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు. ఏడు మందికి తీవ్రగాయాలై నాయి. తీవ్రగాయాలైన వారిని తాంబరం లోని దీపం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
మామూలుగా అయితే నిర్వహకులు అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకుని వీటిని రన్ చేస్తారు. అయినా కూడా అప్పుడప్పుడు అనుకోకుండా ప్రమాదాలు చోటుచేసుకుంటుంటాయి. చెన్నైలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో కొత్త డిస్కో జాయింట్ వీల్ ను ఏర్పాటు చేశారని... ఆ జాయింట్ వీల్ ను పరిశీలిస్తున్న సమయంలోనే అది కాస్త కుప్పకూలిందని విచారణలో వెలుగు చూసింది. ఈ విషయంపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన పార్కు యజమాని జోష్ పునిష్, పార్క్ మేనేజర్ శాంతివేలంలను అరెస్టు చేసి విచారిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.
-Abhinavachary
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more