ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ప్రధాని నరేంద్రమోడీ విద్యార్హతలపై ఎందుకనో సందేహం కలిగింది. ప్రధాని మోడీ విద్యార్హతలు ఏమిటో తెలసుకునేందుకు ఆయన ఏకంగా కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ)కి లేఖ రాశారు. ప్రధాని విద్యార్హతలేమిటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీకి ఉన్న డిగ్రీలేమిటో ప్రజలకు తెలియజేయాల్సిన అసవరముందని, ఈ విషయంలో ప్రజల్లో ఉన్న సందేహాలను తొలగించాలని ఆయన కోరారు.
జపాన్ ప్రధానితో కలసి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంలో ఆ వెనుక భారతీయ జెండా తలకిందులుగా వున్నా.. ఆ విషయాన్ని ప్రధాని పట్టించుకోకపోవడంపై సందేహం వచ్చిందా..? లేక బ్రిటెన్ ప్రర్యటనలో దేశ జాతీయగీతాన్నిఅలపిస్తుండగానే అడుగులు ముందుకు వేసుకుంటూ కదలిని ప్రధానిని మళ్లీ వెనక్కి పిలిపించడం వల్ల కలిగిన సందేహమేమో కానీ వెనువెంటనే ప్రధాని విద్యార్హతలను ప్రకటించాలని ఆయన తన లేఖలో కేంద్ర సమాచార కమీషనర్ ను కోరారు.
'ప్రధాని మోదీ తన విద్యార్హతల గురించి వివరాలు ప్రజలకు తెలియజేయకుండా సంబంధిత విభాగాలను అడ్డుకుంటున్నారని కథనాలు వస్తున్నాయి. ప్రధానికి ఎలాంటి విద్యార్హతలుగానీ, డిగ్రీలుకానీ లేవనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరముంది' అని కేజ్రీవాల్ హిందీలో రాసిన ఈ లేఖలో పేర్కొన్నారు. కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ పేరిట రాసిన ఈ లేఖలో సీఐసీ పనితీరుపైనా కేజ్రీవాల్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. 'నా విద్యార్హతల గురించి పూర్తి వివరాలు మీరు తెలుసుకున్నారు. కానీ ప్రధాని డిగ్రీల గురించి వివరాలు రహస్యంగా ఉంచుతున్నారు. ఇది సీఐసీ స్వతంత్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నది' అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more