సరిగ్గా ఎన్నికల సీజన్.. తమిళనాడులోని అధికార అన్నా డీఎంకే కు సినీ గ్లామర్ తోడైంది. తమిళనాట హోరాహోరి పోరుతో మూడు ప్రధాన పార్టీల మధ్య పోరు రసవత్తరంగా సాగుతుంది. ఇప్పటికే విడుదలైన ప్రీ ఫోల్స్ సర్వేలో జయలలిత మళ్లీ అధికార పగ్గాలను అందుకుంటుందని స్పష్టమైన తరుణంలో ఆ పార్టీకి మరింత గ్లామర్ జోష్ తోడైంది. తెలుగు, తమిళ సినిమాల్లో నటించి.. అభిమానుల్ని అలరించిన ప్రముఖ హీరోయిన్ నమిత రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. తమిళనాడు సీఎం జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకేలో చేరింది. తిరుచ్చిలో జయలలిత ఎన్నికల సభ సందర్భంగా ఆమె అన్నాడీఎంకే కండువాను కప్పుకుంది.
రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి ఉందని, తనను అన్నాడీఎంకేలో చేర్చుకోవాలని నమిత గతంలో లేఖ రాసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు అంగీకరించింది. దీంతో జయలలిత ఆమెను పార్టీలో చేర్చుకున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన 'సొంతం' సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన నమిత.. అటు కొలీవుడ్లోనూ మంచి పేరు తెచ్చుకుంది. తెలుగులో 'జెమినీ', 'బిల్లా', 'సింహా' వంటి సినిమాల్లో నటించిన నమిత తమిళంలో మాత్రం తన అందచందాలతో టాప్ హీరోయిన్గా వెలుగొందింది.
విజయ్కాంత్ సరసన 'ఎంగల్ అన్న' సినిమాతో కొలీవుడ్కు పరిచయమైన నమిత.. అజిత్ సరసన 'బిల్లా' చిత్రంతో భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత తమిళంలో టాప్ హీరోల సరసన నటించి అభిమానుల్ని మెప్పించింది. ఈ భారీ సుందరి అందానికి ఫిదా అయిన తమిళ తంబిలు.. అప్పట్లో ఆమెకు ఓ గుడి కూడా కట్టించారు. అయితే, ఇటీవలికాలంలో నమితకు తెలుగులోనూ, తమిళంలోనూ అవకాశాలు తగ్గాయి. హీరోయిన్ అవకాశాలు రావడం లేదు. అడపాదడపా సెంకండ్ హీరోయిన్ చాన్స్ వస్తున్నప్పటికీ పెద్దగా కెరీర్లో ఊపులేకపోవడంతో ఇక రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని ఆమె నిర్ణయించినట్టు తెలుస్తోంది.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more