రెక్కాడితే కానీ డోక్కాడని కుటంబానికి చెందిన ఓ 13 ఏళ్ల అబాగ్యురాలిని పని కల్పిస్తామని నమ్మబలికిన త్రాష్టులు అమెను బలవంతంగా వ్యభిచారం రోంపిలోకి దింపారు, ఆ బాలికను గత రెండేళ్లుగా 113 మందితో అత్యాచారం చేయించారు. అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే అమె వద్దకు వచ్చిన విటులలో చట్టాన్ని రక్షించాల్సిన వాళ్లూ అదేనండీ పోలీసులు వున్నారు. కంచె చేను మేసిందన్న చందంగా పోలీసులు కూడా ముక్కుపచ్చలారని బాలికపై తమ కామవాంఛ తీర్చుకున్నారు.
పని కల్పిస్తామని చెప్పి పశ్చిమబెంగాల్ నుంచి తీసుకొచ్చి.. తనపై గత రెండేళ్లుగా దాదాపు 113 మంది అత్యాచారం చేశారంటూ 16 ఏళ్ల బాలిక వాపోతోంది. మహారాష్ట్రలోని పుణె నగరానికి తనను తీసుకొచ్చిన వ్యక్తులు బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దించారని, అక్కడ కొందరు పోలీసులతో సహా 113 మంది తనపై అత్యాచారం చేశారని చెప్పింది. గత నెలలో అక్కడి నుంచి తప్పించుకుని ఢిల్లీ పారిపోయి పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఆ కేసును తాజాగా పుణెకు బదిలీ చేసి, 113 మందిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
ఈ కేసులో 26 ఏళ్ల మహిళతో పాటు నలుగురు నిందితులను పోలీసులు అరెస్టుచేశారు. అరెస్టయినవారిలో నేపాల్కు చెందిన స్వీకృతి ఖరేల్ (26), రోహిత్ భండారీ (35), హరీష్ షాహా (25), తపేంద్ర సచి (23), రమేష్ ఠకులా (25) ఉన్నారు. ఇటీవలే ఓ మోడల్ను ఢిల్లీ నుంచి పుణె తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టి అత్యాచారయత్నం చేసిన కేసుకు, ఈ పదహారేళ్ల బాలిక కేసుకు కూడా సంబంధం ఉంది. మోడల్ పూణే నుంచి పారిపోతూ బాలికను కూడా తప్పించి తీసుకెళ్లింది.
వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమబెంగాల్ - నేపాల్ సరిహద్దులోని సిలిగురి ప్రాతానికి చెందిన బాలిక తల్లిని ఆమె తండ్రి వదిలేశాడు. దాంతో ఆమె మతిస్థిమితం కోల్పోయారు. వాళ్ల అమ్మమ్మకు టీ కొట్టు ఉండగా, అక్కడకు భండారీ తరచు వచ్చి సిగరెట్లు కొనుక్కునేవాడు. అప్పుడే ఈ బాలికను చూసి, ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 2014 జనవరిలో పుణె తీసుకెళ్లాడు. కొన్నాళ్లు బాగానే ఉన్నా, తర్వాత వ్యభిచారంలోకి దింపాడు. అతడు కూడా ఆమెపై అత్యాచారం చేశాడు. డ్రగ్స్ ఇచ్చి, ఒకేసారి పలువురితో వ్యభిచారం చేయించేవాడని బాలిక తెలిపింది.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more