వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారిన ద్వారక శారద పీఠాధిపతి శంకరాచార్య స్వరూపానంద సరస్వతి మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు. గత కొన్నాళ్లుగా షిరిడీ సాయిబాబా ఒక ఫకీర్ అని నిందించిన ఆయన సాయిని పూజించడం ద్వారానే మహారాష్ట్రలో కరువు విలయతాండవం చేస్తుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక అంతటితో ఆగకుండా మహారాష్ట్రలోని శని శింగనాపూర్ ఆలయంలోకి మహిళలు వెళ్లడం వారికే ప్రమాదమనీ, దీనివల్ల స్త్రీలపై అత్యాచారాలు అధికమవుతాయని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్య వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
తాజాగా హరిద్వార్ యాత్ర చేస్తున్న శంకరాచార్య స్వరూపానంద సరస్వతి మళ్లీ వ్యాఖ్యలు చేశారు. వందలాధి మంది భక్తులను జలసమాధి చేస్తూ హిమాలయ సుమామీగా అభివర్ణించబడిన ఉత్తరాఖండ్ వరదలను ఆయన టార్గెట్ చేశారు, గత 2013 జూన్లో ఉత్తరాఖండ్లో వరదలు రావడానికి హానీమూన్, విహారయాత్రలకు వచ్చిన వారు సాగించిన అపవిత్రమైన కార్యకలాపాలే ముఖ్య కారణమన్నారు. వారి అపవిత్ర కార్యకలాపాలు వల్లే కేదారనాధ్లో ప్రకృతి విలయం సంభవించి వందలాది మంది మృతి చెందారని స్వరూపానంద సరస్వతి అన్నారు.
అంతేకాక శని శింగనాపూర్ గుడిలోకి మహిళలను అనుమతించడం వల్లే కేరళలోని పుట్టింగల్లో ప్రమాదం సంభవించిదని అన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలపై అటు సాయి భక్తులు ఇటు మహాళా సంఘాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి, ఆయన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఉత్తరాఖండ్ భక్తులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఇప్పటికే గత సంవత్సరం సెప్టెంబర్లో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలంటూ పిల్ దాఖలైన విషయం తెలిసిందే.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more