బీజేపీతో చేతులు కలిపి జమ్మూకశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుకు పీడీపీ సిద్ధమవుతున్న నేపథ్యంలో కమలనాథులపై ఆ పార్టీ మిత్రపక్షం శివసేన ప్రశ్నల వర్షం కురిపించింది. జమ్ముకశ్మీర్ మొదటి మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న మెహబూబా ముఫ్తి 'భారత్ మాతకీ జై' అని ఇప్పుడు నినదిస్తారా? అని శివసేన ప్రశ్నించింది. దీంతో డైలమాలో పడిన బీజేపి శివసేన ప్రశ్నలకు మౌనమే తన సమాధానమని చెప్పకనే చెప్పింది. ఉగ్రవాద దాడుల్లో మృతిచెందిన కశ్మీర్ పండిట్స్ గౌరవార్థం మెహబూబా ముఫ్తితో ఈ నినాదం చేయించగలరా? అని నిలదీయడంపై బీజేపి మిన్నకుండిపోయింది.
అయితే ఈ అంశాన్ని తమకు అనుకూలాంగా అత్యంత తెలివిగా మలిచింది బిజేపి పార్టీకి గాడ్ ఫాధర్ లా వ్యవహరించే ఆరెస్సెస్. యావత్ ప్రపంచం భారత్ మాతాకీ జై అనిపించాలని పిలుపునిచ్చిన మరుసటి రోజునే తన నిర్ణయంపై యూ టార్న్ తీసుకున్న ఆయన భారత్ మాతా కీ జై అనే అంశంపై ఎవరినీ వత్తిడి చేయవద్దని సూచించారు. మన దేశాన్ని అత్యంత ఆదర్శవంతంగా తీర్చిదిద్దితే అప్పుడ ప్రపంచవ్యాప్తంగా అందరూ భారత్ మాతాకీ జై అని చెప్పకుండానే అంటారని అన్నారు. అయితే ఆయన మహబూబా ముఫ్తీ చేత భారత మాతాకీ జై అనిపిస్తారా..? అన్న అంశాన్ని అసలు పరిగణలోనికే తీసుకోలేదు. కానీ ఈ అంశంలో ఎవరనీ వత్తిడి చేయవద్దని మాత్రం సూచించారు.
కేవలం రాజకీయ లబ్ది కోసమే బీజేపిని ఆరెస్సెస్ పక్కదారి పట్టిస్తుందన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వం కారణంగానే తాము భారత్ లోని జమ్మూ కాశ్మీర్ లో అధికారంలోకి వచ్చామని తేల్చిచెప్పిన ముక్తితో కలసి బీజేపి అధికారాన్ని ఎలా పంచుకుంటుందన్న ప్రశ్నలు కూడా వినబడుతున్నాయి. ఇదే సమయంలో శివసేన డిమాండ్ చేసినట్లు అమెతో భారత్ మాతాకీ జై అనిపిస్తారా..? అన్న పశ్నలకు ఇప్పటి వరకు సమాధానమే కరువయ్యింది. అయితే అసలు అరెస్సెస్ కు భారత్ మాతాకీ జై అనే అంశంలో్ ఒక ఐడియానే కొరవడిందన్న విమర్శలు వినబడుతున్నాయి.
మోహబూబా ముఫ్తీ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినా అమె పట్ల ఉదార వైఖరిని కనబర్చడం ఏంటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉగ్రవాదుల పట్ల ఆమె చూపిన ఆపేక్ష గతంలో వివాదాలు సృష్టించినా అమెతో కలసి బీజేపి అధికారాన్ని పంచుకోవడం అవసరమా..? అన్న వాదనలు కూడా వినబడుతున్నాయి. భారత మాతకీ జై అనడం దేశభక్తికి, జాతీయవాదానికి చిహ్నంగా అభిప్రాయపడిన బీజేపి మెహబూబా ఈ నినాదాన్ని చేయగలరా?' అలాంటప్పుడు కొందరినే టార్గెట్ చేసి విమర్శలు కురిపించడమెందుకన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more