భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతలకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) పలు సూచనలు జారీ చేసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు త్వరలో తెరలేవనున్న తరుణంలో వ్యక్తి పూజను మాని జాతీయత, అభివృద్ది కార్యక్రమాలే ఎజెండాగా ముందుకు కదలాలని హితువు పలికింది. అంతేకాదు బీజేపీ నేతలను ఓ మోస్తరుగా హెచ్చరించింది. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్య నాయుడు ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోదీని 'దేవుడు ఇచ్చిన వరం' (గాడ్స్ గిఫ్ట్) అంటూ అభివర్ణించారు. ఈ విషయంపై ఆరెస్సెస్ కాస్త ఆవేశంగా ఉంది.
వ్యక్తి పూజ తగదని బీజేపీ నేతలకు ఆరెస్సెస్ చురకలు అంటించింది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇలాంటి చర్యలకు పాల్పడితే మొదటికే మోసం వస్తుందని సంఘ్ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. ఈ తరుణంలో ప్రధాని నరేంద్రమోడీని కీర్తిస్తూ వ్యాఖ్యలు వద్దని. పేదల పాలిట మెసయ్య అంటూ వెంకయ్య చేసిన వ్యాఖ్యాలపూ అభ్యంతరం తెలిపింది. కేవలం కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి అంశాలను మాత్రమే తమ ప్రచార, ఇతర కార్యక్రమాలలో ప్రస్తావించాలని బీజేపీ నేతలకు సంకేతాలు పంపింది.
ప్రపంచ అగ్రనేతల్లోనే మోదీ ఒకరిని, ఆయన ఇండియాను పూర్తిగా మార్చివేస్తారంటూ వెంకయ్య నాయుడు పేర్కొనడంతో పాటు వ్యక్తిపూజ చేస్తున్నారని ఆరెస్సెస్ అభిప్రాయపడింది. కేవలం అభివృద్ది అంశాలపైనే దృష్టిసారించాలని మంత్రులు, బీజేపీ నేతలకు జాగ్రత్తలు సూచించింది. కాగా ప్రతిపక్షాలు మోడీ దేవుడా అన్న అంశాన్ని ప్రచారస్త్రాంగా చేయాలని, అందుకే ఈ అంశంపై కొద్ది మేరకు హెచ్చరికలు జారీ చేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ప్రత్యర్థి రాజకీయ పార్టీల వ్యూహాలు, ప్రణాళికలు ఎలాగుంటాయో వేచి చూడాలి మరి.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more