బెల్జియం రాజధాని బ్రస్సెల్స్లో జంటబాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. రాజధానిలోని ప్రముఖ విమానాశ్రయం జావెంటమ్ ఎయిర్ పోర్ట్ టర్మినల్ బిల్డింగ్ వద్ద రెండు చోట్ల పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ల ధాటికి భవన అద్దాలన్ని బద్ధలయ్యాయి. ఈ ఘటనలో పదకొండుమంది చనిపోగా 22 మంది గాయాలపాలయినట్లు తెలుస్తోంది. వందమందికి పైగా ఈపేలుడు భారిన పడినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఎయిర్ పోర్ట్ లో ఉన్నవారంతా భయాందోళనతో కేకలు వేస్తూ పరుగులు పెట్టారు. ఆ తరువాత బ్రస్సెల్స్ మెట్రో స్టేషన్ లో కూడా మరో పేలుడు సంభవించింది.
అయితే, పేలుళ్ల ఉగ్రవాదుల చర్యగా పేర్కోన్నారు పోలీసులు. హుటాహుటిన ప్రయాణికులను అత్యవసర ద్వారం ద్వారా బయటకు పంపిన బధ్రతా దళాలు విమానాశ్రయాన్ని మూసివేసి.. తమ అధీనంలోకి తీసుకుని తాత్కాలికంగా మూసివేశారు.ఉగ్రవాదులు విమానాశ్రయంలోనే నక్కి వుంటారని భావిస్తున్న సాయుధ దళాలు వారిని కోసం తనిఖీలు చేస్తున్నారు. అయితే, పేలుళ్లకు ముందు అరబిక్ భాషలో పెద్దగా అరుపులు వినిపించాయని, కాల్పులు కూడా సంభవించాయని కొంతమంది చెప్తున్నారు. టెర్మినల్స్ భవంతుల నుంచి మాత్రం పెద్ద మొత్తంలో పొగ వెలువడుతోంది.
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది, ప్యారిస్ లో బాంబుదాడులకు పాల్పడిన సలాహ్ అబ్దెస్లామ్ను బ్రస్సెల్స్ లో నాలుగు రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఇందుకు ప్రతీకార చర్యగా ఐసిస్ ఉగ్రవాదులు బ్రస్సెల్స్ పై తమ ప్రతీకారన్ని తీర్చుకున్నారని పలువురు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. సలాహ్ అబ్దెస్లామ్ను అరెస్టు చేసిన నాలుగు రోజుల్లోనే ఈ ఘటన చోటుచేసుకోవడం కొంత అనుమానానికి తావిస్తోంది. నగరంలో హై అలెర్ట్ ప్రకటించారు. క్షత్రగాత్రులను అస్పత్రికి తరలించి నగరవ్యాప్తంగా నిఘాను ఏర్పాటు చేసింది.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more