అక్కడ అంతే.. అదంతా వింత కాదు.. అనావాయితీయే.. నితీష్ కుమార్ లాంటి ముఖ్యమంత్రి వున్నా. యువకిశోరం తేజ్ ప్రతాప్ సింగ్ ఉపముఖ్యమంత్రిగా వున్నా.. బిహార్లో మాత్రం మార్పు కనిపించడంలేదు. ఓ వైపు వేతనాలు అందక ఉపాధ్యాయులు కడుపులు మాడ్చుకుని మరీ విద్యార్థులకు పాఠాలు చెబుతుంటే.. మరోవైపు శాసనసభ్యులకు మాత్రం ఖైరీదైన బహుమతులు బిహార్ ప్రభుత్వం అందజేసింది. దీంతో బిహార్ అసెంబ్లీలో 243 మంది ఎమ్మెల్యేలు శుక్రవారం అత్యంత సంతోషంగా కనిపించారు. అధికార, విపక్ష సభ్యులన్న తేడా లేకుండా అందరి మొహాలు మతాబుల్లా వెలిగిపోయాయి.
బడ్జెట్ సమావేశాలకు హాజరైన సభ్యులకు బిహార్ ప్రభుత్వం ఏళ్లుగా వస్తున్న అనావాయితీ ప్రకారం మైక్రో ఓవెన్లు, సూట్ కేసులు, బ్యాగులు అందజేసింది. బడ్జెట్ సెషన్ లో ఎమ్మెల్యేలకు ప్రతి శాఖ వివిధ బహుమతులు ఇవ్వడం బిహార్ లో రెండు దశాబ్దాలుగా జరుగుతోంది. మైక్రో ఓవెన్లను కానుకలుగా ఇచ్చిన విద్యాశాఖ వీటికోసం రూ.30 లక్షలు వెచ్చించింది. చాలా ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోందని విద్యాశాఖ మంత్రి అశోక్ చౌధురి తెలిపారు. దీనిపై స్పందించేందుకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నిరాకరించారు.
కాగా ఎమ్యెల్యేలకు గిఫ్ట్ లు ఇస్తే తప్పేంటని డిప్యూటీ సీఎం తేజశ్వి యాదవ్ ప్రశ్నించారు. 'బిహార్ వెనుకబడిన రాష్ట్రం. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారంతా కోటీశ్వరులు కాదు. పేదలు కూడా ఉన్నారు. ఇలాంటి వారికి కొన్ని కానుకులు ఇస్తే తప్పేంటి. ఈ విషయాన్ని పెద్దది చేయొద్ద' అని సూచించారు. అన్ని శాఖలు కలిపి ఒకే రకమైన కానుక ఇస్తే బాగుంటుందని గతంలో బీజేపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ సూచించినా అధికారులు పట్టించుకోవడం లేదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more