ఏపి అసెంబ్లీలో ప్రజాప్రతినిధుల మాటలు కోటలు దాటాయి. వారి మాటలు వ్యక్తగతంగా ఆరోపనలు చేసుకునే వరకు వచ్చాయి. ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ చేస్తున్న ఆరోపణల మీద అధికార పార్టీ నాయకులు ముప్పేద దాడికి దిగారు. కాగా మంత్రి అచ్చెన్నాయుడు ఓ అడుగు ముందుకు వేసి దూషణల పర్వానికి తెర తీశారు. కాపుల రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం చేసిన ధర్నాపై జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి మాట్లాడుతూ నిరంతరం రాష్ట్రాన్ని అల్లకల్లోలంగా ఉండకపోతే జగన్ కు నిద్రపట్టదని విమర్శించారు. జగన్ కులాలను రెచ్చగొట్టి రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. కాపుల్లో చిచ్చుపెట్టి రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఇచ్చిన మాట ప్రకారం కాపు కార్పొరేషన్కు ఈ బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందన్నారు. బీసీలకు నష్టం కలుగకుండా కాపులను బీసీల్లో చేర్చుతామని ఆయన స్పష్టం చేశారు. కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు.
సోలార్ పవర్ వ్యవహారంలో అవినీతి జరిగినట్టు జగన్ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. టెండర్లే పిలవని ఈ సోలార్ పవర్ ప్రాజెక్టు వ్యవహారంలో 7 వేల కోట్ల అవినీతి జరిగిందని జగన్ అనడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు.అయితే పదేపదే ప్రతిపక్ష వైపు నుంచి వస్తున్న రన్నింగ్ కామెంటరీకి ఒక్కసారిగా మంత్రి అచ్చెనాయుడు జగన్ పై ఫైర్ అయ్యాడు. దమ్ముంటే, మగాడివాతే, రాయలసీమ బిడ్డవైతే నిజాలు నిరూపించు అని ఆవేశంగా మాట్లాడారు. అనంతరం మంత్రి తమ ప్రభుత్వం పై జగన్ చేస్తున్న అసత్యాలు, అవినీతి ఆరోపణలు నిరూపిస్తే క్రీయాశీల రాజకీయాలనుండి శాస్వతంగా తప్పుకుంటానని లేకపోతే జగన్ తక్షణమే తట్టబట్టు సర్దుకుపోవాలని డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more