24 గంటలు గడిస్తే చాలు ఆ ఇంటి ఆడపడచు.. మరోకరికి భార్య అవుతుంది.. ఎంతో సంతోషంగా అమ్మాయికి కళ్యాణం కోసం అనేక వ్యయప్రయాలు పడి మంచి వరుడ్ని తీసుకోచ్చింది ఆ తల్లి. అయినా సరే.. మరికొన్ని గంట్లలో పెళ్లి అని తెలిసినా.. అమ్మ అపర కాళీలా మారింది, తన కూతురు చేసిన తప్పును భరించలేకపోయింది. అంతే కన్న కూతురి ముఖంపై దిండు పెట్టి తల్లే చంపేసింది. దేశ రాజధాని ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన సంచలనం రేకెత్తించింది,
మరొక్క రోజులో పెళ్లి ఉండటంతో షాపింగ్ పని మీద బయటకు వెళ్లి వచ్చిన తల్లికి.. తన కూతురు తమ ఇంట్లో అద్దెకు ఉండే వ్యక్తితో అభ్యంతరకరమైన పరిస్థితిలో కనిపించడంతో ఆమె ఆవేశం పట్టలేకపోయింది. అతడు ఎలాగోలా పారిపోగా.. కూతురిని ఏం చేయాలో తెలియక, చివరకు ముఖం మీద దిండు పెట్టి నొక్కి చంపేసింది. తర్వాత కొడుకుని పిలిచి, జరిగిన విషయం అంతా చెప్పింది. ఆ సమయానికి ఇంటి నిండా బోలెడంత మంది చుట్టాలు కూడా ఉన్నారు. వాళ్లతో.. కూతురికి గుండెపోటు వచ్చిందని, దాంతో ఆస్పత్రికి తీసుకెళ్తున్నామని చెప్పింది.
తన కొడుకుతో కలిసి, కూతురి మృతదేహాన్ని లోక్నాయక్ ఆస్పత్రికి తీసుకెళ్లి, అక్కడి వైద్యులకు ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్లు చెప్పింది. ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు బాధితురాలి తల్లిమీద, సోదరుడి మీద కేసు నమోదుచేసి వారిని అరెస్టు చేశారు. ఘజియాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్తతో ఆమెకు పెళ్లి కావాల్సి ఉంది. కానీ, ఇంట్లో అద్దెకు ఉండే వ్యక్తితో ఆమెకు ఎప్పటి నుంచో సంబంధం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఆమె తండ్రి కొన్నేళ్ల క్రితం మరణించాడు. తర్వాతి నుంచి ఆమె సోదరుడు ఓ ఫ్యాక్టరీలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. పెళ్లితో కళకళలాడాల్సిన కుటుంబంలో ఇప్పుడు అనుకోని విషాదం చోటుచేసుకుంది. కూతురు మరణించగా, తల్లీకొడుకులు జైల్లో ఉన్నారు.
జి, మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more