ప్రముఖ వ్యాపారవేత్త విజయమాల్యా దేశం విడిచి వెళ్ళడంపై స్పందించిన ఢిల్లీ ముఖ్యమంత్రి, అమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తూర్పారబడ్డారు. ఐడీబీఐలో రుణం తీసుకుని మోసం చేసిన కేసులో కింగ్ఫిషర్ విమానయాన సంస్థ మాజీ ఛైర్మన్ విజయ్మాల్యాను దేశం నుంచి ఎలా వెళ్లనిచ్చారని దేశప్రధానికి కేజ్రీవాల్ ప్రశ్న వేశారు. ఇప్పటికే ఎన్డీఏ మిత్రపక్షం శివసేన కూడా కేంద్రాన్ని ఈ విషయమై ప్రశ్నించిన విషయం తెలిసిందే.
మనీ ల్యాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యాను దేశం విడిచి ఎలా వెళ్ళనిచ్చారంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విమర్శించారు. సమస్యల్లో చిక్కుకున్న విజయ్ మాల్యాను దేశం విడిచి వెళ్ళేందుకు ఎలా అనుమతించారంటూ కేజ్రీవాల్ ట్విట్టర్ ద్వారా మండిపడ్డారు. బ్యాంకులు ముందుకు రాకపోయినా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సుమోటోగా కేసు నమోదు చేసినా.. మాల్యాను దేశం ఎలా వదిలేలా చేశారని ప్రశ్నించారు.
సిబీఐ నుంచి నేరుగా ప్రధానికి నివేదికలు పంపినా మాల్యాను ఎలా వెళ్ళనిచ్చారో తెలపాలని కోరారు. మాల్యా మార్చి 2వ తేదీ ఎవరి అనుమతితో దేశం విడిచి వెళ్ళారని అన్నారు. మాల్యాపై ఉదంతంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో పాటు ప్రతిపక్షాలు, ఎన్డీఏ మిత్రపక్షం శివసేన మండిపడుతుంటే మాజీ ప్రధాని దేవేగౌడ, విజయ్మాల్యా మాజీ పార్లమెంట్ సహచరుడు ఫరూఖ్ అబ్దుల్లా నుంచి మద్దతు లభిస్తోన్న విషయం తెలిసిందే.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more