‘‘భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్య చేసి పెద్ద తప్పు చేశామని’’ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీఈ) సిద్ధాంతకర్త ఆంటన్ బాలసింగమ్ తన అంత్యకాలంలో తీవ్రంగా పశ్చాత్తాపపడ్డాడట. రాజీవ్ గాంధీ లాంటి నేతను హతమార్చాలన్నది తమ విధానాలకే విరుద్ధం. చాలా దురదృష్టకరం అని ఆయన నిత్యం బాధపడేవారట. ఈ మేరకు శ్రీలంకలో నార్వే మాజీ ప్రత్యేక దూత ఎరిక్ సోలిమ్ ను ఉటంకిస్తూ రచయిత మార్క్ సాల్టర్ తాను రాసిన ‘టు ఎండ్ ఏ సివిల్ వార్’పుస్తకంలో పేర్కొన్నారు.
గతంలో సోలిమ్ ను కలిసిన బాలసింగమ్... రాజీవ్ హత్యపై పశ్చాత్తాపాన్ని ప్రకటించారని సాల్టర్ పేర్కొన్నారు. అయితే సోలిమ్ తో బాలసింగమ్ మాట్లాడిన విషయాలన్నీ అనధికారికమేనని సాల్టర్ తన పుస్తకంలో స్పష్టం చేశారు. ఇటీవలే మార్కెట్ లోకి వచ్చిన ఈ పుస్తకం ఆధారంగా రాజీవ్ హత్యకు సంబంధించి ఎల్టీటీఈ అనుసరించిన దాగుడు మూతల వైఖరి కొనసాగిందట. అయితే సిద్దాంతకర్తకే తెలియకుండా రాజీవ్ గాంధీ హత్య జరిగిందని, రాజీవ్ హత్య తరువాత చాలా కాలం నాటికి ఈ విషయాన్ని ప్రభాకరన్ తన ముందు అంగీకరించాడని.. దీంతోనే బాలసింగమ్ తీవ్రంగా పశ్చాతాపపడ్డాడని తెలిపాడని సాల్టర్ పేర్కోన్నాడు.
రాజీవ్ గాంధీ తిరిగి భారత ప్రధానిగా బాధ్యతలు చేపడితే తమపై మూకుమ్మడి దాడి జరగడం ఖాయమన్న భావనతోనే ఎల్టీటీఈ చీఫ్ ‘పెద్ద పులి’ ప్రభాకరన్ ఈ దురాగతానికి పాల్పడ్డాడు. అయితే సంస్థ సిద్ధాంతకర్తగా ఉన్న బాలసింగమ్ వద్ద ఈ విషయాన్ని దాచిన ప్రభాకరన్... తన ఇంటెలిజెన్స్ చీఫ్ పొట్టు అమ్మాన్ తో కలిసి కార్యాన్ని పూర్తి చేశాడు. ఆ తర్వాత చాలాకాలం వరకూ రాజీవ్ హత్య తమ పని కాదని ప్రభాకరన్ చెబుతూ వచ్చాడు. చాలాకాలానికి బాలసింగమ్ వద్ద ప్రభాకరన్ అసలు విషయాన్ని చెప్పాడు. ఆ తర్వాత లండన్ లో ఆశ్రయం పొందిన బాలసింగమ్ 2006లో కేన్సర్ తో మరణించాడు. చనిపోవడానికి ముందు రాజీవ్ హత్యపై ఆయన భారత్ ను క్షమాపణ కోరేందుకు యత్నించి విఫలమయ్యాడు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more