నవభారత నిర్మాణానికి నవ మార్గాలే తమ ప్రభుత్వ ఎజెండా అని అరుణ్ జైట్లీ చెప్పారు. రైతు సంక్షేమం నుంచి పన్ను సంస్కరణల వరకు 9 లక్ష్యాలను వివరించారు. రైతుల కోసం జాతీయ స్థాయి ఇ ప్లాట్ ఫాం వ్యవస్థను డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న జాతికి అంకితం చేస్తామని అరుణ్ జైట్లీ తెలిపారు. వీటి ద్వారా 97 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను దాచుకోవచ్చని చెప్పారు. నాబార్డ్ ద్వారా దీర్ఘకాలిక ఇరిగేషన్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్టు అరుణ్ జైట్లీ ప్రకటించారు. దీనికి ప్రాథమికంగా 20 వేల కోట్లు కేటాయించారు. గ్రౌండ్ వాటర్ మేనేజిమెంట్ కోసం 60 వేల కోట్లు కేటాయించారు.
ఉపాధి హామీ పథకానికి కేంద్ర బడ్జెట్లో రూ.38,500 కోట్లు కేటాయించారు. గత ఏడాది కంటే రూ. 4 వేల కోట్లు అదనంగా కేటాయించినట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. భూగర్భ జలాల పెంపునకు రూ.60 వేల కోట్లు. గ్రామీణాభివృద్ధికి రూ. 87,765 కోట్లు, గ్రామీణ ప్రాంతాల్లో పాలు, తదితర వాటి కోసం ఈ-మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. గ్రామీణ, మున్సిపాల్టీల అభివృద్ధికి బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేశారు. రూ. 2.87లక్షల కోట్లు, అంటే గతంతో పోల్చుకుంటే 228 శాతం అధికంగా కేటాయించారు. గ్రామాల్లో సదుపాయల కల్పనకు పెద్ద పీట వెళారు. గ్రామీణ విద్యుదీకరణకు సంబంధించిన ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకానికి రూ. 38,500 కోట్లు కేటాయించారు. గ్రామాల్లో డిజిటల్ విద్యావ్యాప్తి వచ్చే మూడేళ్లలో 6కోట్ల గృహాలను డిజిటల్ లిట్రసీ స్కీం పరిధిలోకి తీసుకురానున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more