ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్, ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీ లను హతమారుస్తామని ఐఎస్ఐఎస్ హెచ్చరించింది. సోషల్ మీడియా ఖాతాల్లో ఉగ్రవాద సమాచార నియంత్రణకు ప్రయత్నిస్తున్న వారిద్దరికీ వ్యతిరేకంగా పోరాడతామని ఐఎస్ఐఎస్ ప్రకటించింది. ఇద్దరికి వ్యతిరేకంగా ఐఎస్ తాజాగా ఒక వీడియోను ఆన్లైన్లో పెట్టింది. వారి ముఖాలపై బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నట్లు డిజిటల్గా రూపొందించిన ఫొటోగ్రాఫ్ను వీడియోలో ప్రదర్శించారు. అమెరికాకు మిత్రపక్షాలుగా వ్యవహరిస్తున్న వీరిద్దరికీ ప్రాణహాని తప్పదని 25 నిమిషాల సేపు సాగే ఈ వీడియో క్లిప్పింగ్ స్పష్టం చేసింది.
కాలిఫట్ సామ్రాజ్య సైనికుల వారసులమని ప్రకటించిన ఐఎస్.. ఫ్లేమ్స్ ఆఫ్ సపోర్టర్స్ అనే పేరుతో ఈ వీడియోను విడుదల చేసిందని బ్రిటన్లోని ప్రముఖ దినపత్రిక సన్ ఓ వార్తా కథనం ప్రచురించింది. తమ ప్రచారాన్ని నిరోధిస్తామని రోజు ప్రకటిస్తున్న ట్విట్టర్, ఫేస్బుక్ వ్యవస్థాపకులు, వారి మిత్రపక్షం అమెరికాలపై పదిరెట్లు దాడి చేయగల సామర్థ్యం ఉందని వీడియో ముగింపు స్లైడ్లో ఇంగ్లిష్లో వ్యాఖ్యలు వినిపించాయి. తమకు 10 వేలకు పైగా ఫేస్బుక్ ఖాతాలు, 150 ఫేస్బుక్ గ్రూప్లు, 5000లకు పైగా ట్విట్టర్ ఖాతాలను హ్యాక్ చేసే దమ్మున్నదని వీడియోలోని మరో స్లైడ్ పేర్కొన్నది. కొన్ని వారాల క్రితమే ఉగ్రవాద సమాచారం తొలగింపు ప్రక్రియను చేపట్టిన ట్విట్టర్ ఇప్పటివరకు 1.25 లక్షలకు పైగా ఖాతాలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఉగ్రవాద వ్యతిరేక పోరాటానికి మద్దతుపై తమ వైఖరి యథాతథంగా ఉంటుందని ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్ పునరుద్ఘాటించారు. తమకు వ్యతిరేకంగా ట్విట్టర్ వ్యవస్థాపకుడు డోర్సీ యుద్ధం ప్రకటించారని పేర్కొన్న ఐఎస్.. తమ సైనికులు, మద్దతుదారులకు ట్విట్టర్ సిబ్బంది అధికారిక లక్ష్యాలవుతారని హెచ్చరించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more