హైదరాబాద్ మరో గౌరవాన్ని దక్కించుకుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ విషయంలో భారత్ లో హైదరాబాదే నంబర్ వన్ అంటోంది న్యూయార్క్ బేస్డ్ కన్సల్టింగ్ ఏజెన్సీ మెర్సెర్. ప్రపంచ వ్యాప్తంగా జీవించడానికి అనుకూలంగా ఉన్న నగరాలపై మెర్సెర్ సర్వే చేసింది. ఆయా ప్రాంతాల్లోని రాజకీయ స్థిరత్వం, ప్రజల ఆరోగ్య పరిస్థితులు, కాలుష్య స్థాయి, రవాణా సదుపాయాలు, విద్యా అవకాశాలు, క్రైం రేట్ ఆధారంగా నగరాలకు ర్యాంకులు కేటాయించింది. ఇందులో హైదరాబాద్ 139వ స్థానాన్ని దక్కించుకుంది. వరుసగా రెండో సారి ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది.
వాల్డ్ వైడ్ గా 450 నగరాల్లో అధ్యయనం చేసిన మెర్సెర్ సంస్థ… 230 సిటీలకు ర్యాంకులు ఇస్తూ లిస్ట్ తయారుచేసింది. ఇందులో ఆస్ట్రియా రాజధాని వియన్నా ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ఇక మన దేశం విషయానికొస్తే.. హైదరాబాద్ తర్వాత ఫుణె 144, బెంగళూరు 145, చెన్నై 150, ముంబై 152, కోల్ కతా 160, ఢిల్లీ 161 స్థానాలు దక్కించుకున్నాయి. ఢిల్లీ, ముంబై ల్లో రోజు రోజుకు జనాభా పెరుగుతున్నా కనీస సౌకర్యాలు ఉండటం లేదంటోంది మెర్సెర్. తాగునీటి కష్టాలు, విపరీతమైన కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది. భారత్ లోని మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో పరిస్థితి చాలా బెటర్ గా ఉందని చెబుతోంది.
మెర్సెర్ సర్వేలో సింగపూర్ 26 స్థానాన్ని దక్కించుకుంది. జపాన్ రాజధాని టోక్యో, మలేషియా రాజధాని కౌలాలంపూర్ 84 స్థానాన్ని దక్కించుకున్నాయి. చైనా రాజధాని బీజింగ్ 118 వ ప్లేస్ లో ఉండగా.. శ్రీలంక రాజధాని కొలొంబో 132 వ ప్లేస్ లో నిలిచింది. ఇరాక్ రాజధాని బాగ్ధాద్ ఈ లిస్ట్ లో లాస్ట్ ప్లేస్ తో సరిపెట్టుకుంది. ఇక ఇండియాలో అత్యంత సురక్షిత నగరాల జాబితాలో 113 ర్యాంక్ తో చెన్నై ఫస్ట్ ప్లేస్ లో ఉంది. 121 స్థానంతో హైదరాబాద్ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. 123 ర్యాంకుతో బెంగళూరు మూడో స్థానాన్ని సొంతం చేసుకుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more