టీడీపీ సీనియర్ నేత, శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్రావు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. దీంతో నాయకులను తయారు చేసే కర్మాగారంగా చెప్పుకున్న తెలంగాణ టీడీపీ పార్టీ రమారమి ఖాళీ అయ్యంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సమక్షంలో ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు రాజేంద్రనగర్ టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ కూడా టీఆర్ఎస్లో చేరారు. కుత్బుల్లాపూర్ టీడీపీ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ టీఆర్ఎస్లో చేరిన మరుసటి రోజునే ఇలా ఏకంగా టీడీఎల్పీ నేత మరో ఎమ్మెల్యేతో కలసి టీఆర్ఎస్లో చేరి టీడీపీకి కోలుకోలేని షాకిచ్చారు.
ఎర్రబెల్లి టీఆర్ఎస్ లో చేరికకు భారీ నీటిపారుదల మంత్రి టి.హరీశ్రావు, ముఖ్యపాత్ర ఫోషించారని తెలుస్తుంది. నిన్న సాయంత్రం నారాయణ్ ఖేడ్ నుంచి హైదరాబాద్ ఆదర్శనగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లోని ఎర్రబెల్లి నివాసానికి చేరుకున్న ఆయన గంటసేపు ఎర్రబెల్లితో చర్చలు జరిపారు. ఎర్రబెల్లి సహా ఆయన కుటుంబ సభ్యులను కూడా ఒప్పించారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అనంతరం హరీశ్ తన కారులోనే ఎర్రబెల్లి, ప్రకాశ్ గౌడ్ ఇద్దరినీ వెంట తీసుకుని సీఎం అధికారిక నివాసానికి చేరుకున్నారు. కేసీఆర్ వారిద్దరితో దాదాపు గంటసేపు మాట్లాడారు. అనంతరం వారికి గులాబీ కుండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
తెలంగాణలో టీడీపీ మనజాలదు
తెలంగాణ ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని, రాష్ట్రంలో టీడీపీ మనజాలదని ఎర్రబెల్లి అన్నారు. గులాబీ కండువా కప్పుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. మరో ఇద్దరు ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్లోకి వచ్చే అవకాశముందని వివరించారు. వరంగల్ జిల్లాకు చెందిన మరికొందరు టీడీపీ నాయకులు కూడా త్వరలో టీఆర్ఎస్లో చేరతారన్నారు. టీడీపీ శాసనసభా పక్షాన్ని (టీడీఎల్పీని) టీఆర్ఎస్లో విలీనం చేస్తూ స్పీకర్ మధుసూదనాచారికి లేఖ ఇవ్వనున్నట్టు కూడా ఎర్రబెల్లి చెప్పారు. ‘‘టీడీపీని వీడటం బాధగానే ఉంది. తప్పని పరిస్థితుల్లో పార్టీ మారుతున్నా, కార్యకర్తలంతా క్షమించాలి. తెలంగాణలో టీడీపీని కాపాడే ప్రయత్నం చేశానని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more