సంచనలం సృష్టించిన కాంగ్రెస్ ఏకలవ్య స్టోరీలో కొత్త ట్విస్టు వెలుగులోకి వచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ, సోనియాగాంధీలకు బెయిలు వస్తే తాను తన వేలును దేవుడికి మొక్కుగా చెల్లిస్తానని... దాన్ని చెల్లించాడన్న వార్త సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వరస్వామి వారి హుండీలో తన మొక్కును చెల్లించినట్లు ఆయన వెల్లడించారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రం దీన్ని ఖండిస్తోంది. రెండు వేల సంవత్సరాల నాటి ఆలయంలో ఇలాంటి వాటికి చోటులేదని డిప్యూటీ ఈవో రమణ వెల్లడించారు.
కాంగ్రెస్ కార్యకర్త ఒకరు టిటిడి హుండీలో తన వేలును సమర్పిచినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని అంటున్నారు. అసలు ఇలాంటి వాటికి తావు లేదని కూడా ఆయన అంటున్నారు. హుండీ చుట్టూ కెమెరాలు ఉంటాయని.. సెక్యూరిటీ ఎంతో కట్టుదిట్టంగా ఉంటుందని... ఎంతో మంది తమ నగదు, నగలను స్వామి వారికి సమర్పిస్తారని అంతే కానీ ఇప్పటి వరకు ఎవరూ కూడా వేలిని సమర్పించడం జరగలేదని అంటున్నారు. రోజుకు మూడు సార్లు స్వామి వారికి వచ్చిన కానుకలను లెక్కిస్తామని... పూర్తి నిఘా మధ్య స్వామి వారి హుండీని లెక్కిస్తామని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు దీని మీద వార్తలు వస్తే చూడండం తప్పితే అందులో నిజం లేదని అంటున్నారు. అలాగే తప్పు వార్తల వల్ల ఆలయ ప్రాశస్తాన్ని నాశనం చెయ్యవద్దని కూడా ఆయన కోరుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more