Chief Minister and officers very scared on a photo in social media

Chief minister and officers very scared on a photo in social media

Social Media, Photo, Delhi, Odd and Even system, Delhi Pollution, Social media on Kejriwal govt

One dominant characteristic of social media is the herd mentality that it seems to encourage among its users. Often, content on social media is shared and outraged over without verification of its authenticity or relevance. That's exactly what happened on Monday--the fourth day of the implementation of the odd-even rule by the Delhi government.

నెట్ లో ఆ ఫోటో... సిఎంతో సహా అందరికి పరేషాన్

Posted: 01/05/2016 04:26 PM IST
Chief minister and officers very scared on a photo in social media

ఒకే ఫోటో.. ఒకే ఒక్క ఫోటో.. ముఖ్యమంత్రి నుండి అధికారుల వరకు అందరికి తలనొప్పిని తీసుకువచ్చింది. ఆ ఒక్క ఫోటో చూసిన నెటిజన్లు ప్రభుత్వం మీద తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టేశారు.. అసలే టైం బ్యాడ్ అనుకుంటున్న సిఎం హుటాహుటిన మ్యాటర్ ఏంటా అని ఆరా తీశారు. పాపం తర్వాత తెలిసింది అదో పాత ఫోటో. దాన్ని మళ్లీ ఇంటర్ నెట్ లో పెట్టేసరికి నెటిజన్లు షేర్ చేశారని.. దాంతో సీన్ సితారైందని. ఇదంతా ఎక్కడ జరిగింది ఎందుకు జరిగింది అనుకుంటున్నారా..? అయితే మొత్తం చదవండి.

కార్ల రాకపోకలను నియంత్రించడానికి దిల్లీలో నాలుగురోజులుగా సరిబేసి విధానాన్ని అనుసరిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేశారు.అయితే ఢిల్లీలోని  రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ వద్ద ఇసుక పడితే రాలనంత జనంతో కిక్కిరిసి వెళ్తున్న మెట్రో రైలు ఫోటోను ఎవరో ఆన్ లైన్ లో పోస్ట్ చేశారు. వెంటనే సోషల్ మీడియా యూజర్లు ముఖ్యంగా ట్విట్టర్ యూజర్లు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఈ సరిబేసి విధానం ఏంటంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.


నిజానికి ఆ ఫోటో అక్టోబర్ 22, 2014వ తేదీన దీపావళి రోజు తీసిన ఫోటో. దీన్ని అప్పట్లో హిందుస్ధాన్ టైమ్స్ పత్రిక ప్రచురించింది. దాన్నెవరో ఊరకనే ఉండక  సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది ఇప్పటి ఫోటో అనుకున్న జనం వాస్తవం తెలుసుకోకుండా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అయితే హిందుస్ధాన్ టైమ్స్ పత్రికఈ ఫోటోకు నగరంలో అమలౌతున్న సరిబేసి విధానానికి సంబంధం లేదని ట్వీట్ చేయడంతో యూజర్లు శాంతించారు. అయితే సరిబేసి విధానం వల్ల ఇబ్బందులు పడుతున్న కొందరు ప్రయాణికులు భారీ సంఖ్యలో పబ్లిక్ ట్రాన్స్ పోర్టును ఆశ్రయించారు. రద్దీని తట్టుకునేందుకు అదనంగా బస్సులు నడిపారు. మెట్రో రైళ్లు కూడా అదనపు ట్రిప్పులు తిరగాల్సి వచ్చింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Social Media  Photo  Delhi  Odd and Even system  Delhi Pollution  Social media on Kejriwal govt  

Other Articles