అరబ్ దేశాల్లో అందులోనూ ముఖ్యంగా సౌదీ అరేబియాలో అయితే చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తప్పు చేసింది ఎవరు అయినా కానీ ఎలాంటి తాత్సారం లేకుండా శిక్ష విధించడం జరుగుతుంది. అయితే తాజాగా ఒకేసారి 47 మందికి ఉరిశిక్ష అమలు చెయ్యడం సంచలనం రేపింది. సౌదీ అరేబియాలో షీయా మతనాయకుడు షేక్ నిమ్ర్ అల్ నిమ్ర్ తో సహా 47 మందికి ఉరిశిక్ష అమలు చేశారు. టెర్రరిస్ట్ కార్యకలాపాలకు పాల్పడినందుకు వీరందరినీ ఉరితీసినట్లు సౌదీ హోం మంత్రిత్వశాఖ ప్రకటించింది. షియా కమ్యునిటీ మతనాయకుడైన షేక్ నీమ్ర్ 2011లో ఈస్టర్న్ ప్రావిన్స్ లో ప్రభుత్వ వ్యతిరేక నిరనలకు మద్దతుగా పలు ప్రసంగాలు చేశారు. రెండేళ్ల క్రితం ఆయనను అరెస్ట్ చేయడంతో దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు మిన్నుముట్టాయి. దీంతో సౌదీ ప్రభుత్వం కేసుపెట్టింది.
కోర్టు గత అక్టోబర్ లో షేక్ నిమ్ర్ –కు మరణశిక్ష విధించింది. రాజ్యద్రోహం కేసులో ఆయనను దోషిగా నిర్ణయించారు. పాలకులను ఆదేశాలను అలక్ష్యం చేయడంతో పాటు భద్రతా దళాలపై ఆయుధాలు ప్రయోగించిన నేరాల్లో షేక్ ను దోషిగా నిర్థారించారు. సౌదీలో సున్నీ పాలన సాగుతుంటే.. షియాలు అధికారంలో ఉన్న ఇరాన్ ఇప్పటికే.. షేక్ విషయంలో హెచ్చరికలు జారీ చేసింది. షియా నేతకు ఉరి శిక్ష అమలు వల్ల సౌదీ భారీ మూల్యం చెల్లించవలసివస్తుందని ఇరాన్ హెచ్చరించింది. షేక్ తో పాటు 47 మందికి ఉరిశిక్ష అమలు చేశారు. వారిలో కంబోడియా, ఈజిప్ట్ కు చెందిన ఇద్దరు పౌరులు ఉన్నారు. మిగతావారంతా సౌదీ పౌరులే. సౌదీ నిరుడు 150 మందికి పైగా వ్యక్తులను ఉరి తీసింది.20 ఏళ్లలో ఇంత పెద్దఎత్తున మరణ శిక్ష అమలు ఇదే ప్రథమం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more