వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారంపై నలుగురు సభ్యులతో కమిటీని స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్ ను అధ్యక్షుడిగా నియమించారు. ఈ కమిటీ సభ్యులుగా టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్-రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు నియమితులయ్యారు. ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై 20 రోజుల్లో ఈ కమిటీ సభాపతికి నివేదిక అందజేయాలని స్పీకర్ కోడెల ఆదేశించారు. ఇటీవల జరిగిన శాసనసభ శీతాకాల సమావేశాల్లో అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
కాగా రోజాను అధికారం లేకుండానే ఏడాది పాటు సస్పెండ్ చేశారంటూ వైసీపీ అధ్యక్షుడు, ఆ పార్టీ శాసనసభా పక్షం నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా సభ్యులంతా శీతాకాల సమావేశాలను వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. ఏపి అసెంబ్లీలో రోజా చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణించిన స్పీకర్ ఆమెను ఏడాది పాటు సస్పెండ్ చేశారు. అయితే రోజా ఎమ్మెల్యే అనితతో సహా, ఏపి సిఎం చంద్రబాబు నాయుడు మీద వాడకూడని భాష వాడినట్లు సభ్యులు మండిపడ్డారు. దాంతో ఎమ్మెల్యే అనిత, యనమల రామకృష్ణుడు ఆమెను సభ నుండి సస్పెండ్ చేయాలని సిఫారిసు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more