భారత్కు చెందిన ఓ టెక్స్టైల్ కంపెనీ యజమానికి అమెరికా రూ. 66 లక్షల జరిమానా విధించింది. పైరెటేడ్ సాఫ్ట్వేర్ వాడినందుకే మధ్యప్రదేశ్లోని ప్రతిభ సింటెక్స్ లిమిటెడ్ కంపెనీ యజమానికి జరిమానా విధించినట్లు అమెరికా వెల్లడించింది. అమెరికాకు చెందిన అగ్రశ్రేణి కంపెనీలకు ప్రతిభ సింటెక్స్ లిమిటెడ్ కంపెనీ పెద్ద ఎత్తున వస్ర్తాలను ఎగుమతి చేస్తుంది. ఈ క్రమంలో ప్రతిభ కంపెనీ పైరేటెడ్ సాఫ్ట్వేర్ వాడి అక్రమ వ్యాపారం చేసినట్లు వెలుగు చూసింది.
పైరెటేడ్ సాఫ్ట్వేర్ వాడటం వల్లనే పలు కంపెనీలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, అమెరికా సాఫ్ట్వేర్ కంపెనీలు కొత్త ఉత్పత్తులను తయారు చేసుకోలేక పోయిందని కాలిఫోర్నియా అటర్నీ జనరల్ కమలా హారిస్ అన్నారు. ఇక అక్రమ వ్యాపారం చేసిన ప్రతిభ సింటెక్స్ లిమిటెడ్ కంపెనీకి అమెరికాలోని కాలిఫోర్నియా న్యాయస్థారనం రూ. 66 లక్షలు జరిమానా విధించింది. రూ. 66 లక్షలను నెల రోజుల్లోనే చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
యావత్ ప్రపంచం ఇలాంటి దుశ్చర్యలను ఖండించాలని, ఫైరసీ సాఫ్ట్ వేర్ లను వాడితే జరిగే పరిణామాలు ఎంత తీవ్రంగా వుంటాయో కూడా గమనించాలని న్యాయస్థానం పేర్కోంది. ఒకరి మేధోసంపత్తిని అక్రమంగా దొంగలించి వినియోగించడం ఎంత పెద్ద నేరమో కూడా అర్థం కావాలని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కాగా ఫైరసీ సాఫ్ట్ వేర్ వినియోగించిన కేసులో తొలిసారిగా భారత్ కు చెందిన ఒక అంతర్జాతీయ సంస్థపై న్యాయస్థానం జరిమానా విధించిందని న్యాయనిపుణ వర్గాలు పేర్కోంటున్నాయి.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more