గూగుల్ సీఈవో సుందర్ పిచ్చాయ్ హైదరాబాద్ కు ఇదివరకే ప్రకటించిన శుభవార్తను త్వరలోనే చేపడతామని చెప్పారు. ప్రముఖ ఐటి సంస్థ గూగుల్ తన కొత్త క్యాంపన్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. దేశ అవసరాలకు తగిన విదంగా కొత్త ఉత్పత్తుల తయారీకి కొత్త కాంపస్ అవసరమని, దానిని హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. భారతదేశంలోని వంద రైల్వే స్టేషన్లకు 2016 డిసెంబర్ నాటికల్లా వై-ఫై సదుపాయం కల్పిస్తామని చెప్పారు. రైల్ టెల్ సహకారంతో దీనిని ఏర్పాటు చేస్తామని చెప్పారు.
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని మరింత పెంచడమే లక్ష్యంగా పిచాయ్ పర్యటన సాగుతున్నట్లు తెలుస్తోంది. సామాన్యుడి చెంతకు కూడా టెక్నాలజీని తీసుకెళ్లాలన్నది పిచాయ్ వ్యూహమని చెబుతున్నారు. దేశంలోని 3 లక్షల గ్రామాల మహిళలకు ఇంటర్ నెట్ సదుపాయం కల్పించేందుకు గూగుల్ సాయం చేస్తుందన్నారు. ఇక ఉపఖండంలో క్రికెట్ క్రీడకు వున్న ప్రాధాన్యతను తెలుసుకున్న గూగుల్ నూతన సంవత్సరం నుంచి క్రికెట్ అప్ డేట్స్ కూడా అందించేందుకు సిద్దమవుతుంది. సుందర్ పిచ్చాయ్ పర్యటనలో ప్రధానంగా ఐదు అంశాలను ప్రస్తావిస్తున్నారు.
* భారతదేశంలోని వంద రైల్వే స్టేషన్లలో రైల్టెల్ సహకారంతో 2016 డిసెంబర్ నాటికల్లా వై-ఫై సేవలు
* మూడేళ్లలో భారతదేశంలోని 3 లక్షల గ్రామాల్లో మహిళలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు గూగుల్ సాయం
* భారతదేశం కోసం ఉత్పత్తులు తయారుచేసేందుకు హైదరాబాద్లో 'ఇంజనీరింగ్ ప్రెజెన్స్'ను పెంచడం
* 11 భాషల్లో టైప్ చేసేందుకు ఉపయోగపడే గూగుల్ 'ఇండిక్' కీబోర్డు
* 2016 నుంచి గూగుల్ సెర్చ్ ద్వారా లైవ్ క్రికెట్ అప్డేట్లు
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more