అది ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ నగరం. ఇవాళ ఉదయం అక్కడ ఒక్కసారిగా కాల్పుల కలకలం రేగింది. తుపాకులు చేతబట్టిన ముగ్గురు కిడ్నాపర్లు అక్కడి ఓ పాఠశాలలోకి చొచ్చుకెళ్లారు. వారితో ఒ టీనేజ్ అబ్బాయి కూడా వున్నాడు. పాఠశాలలో వున్నవిద్యార్థులు, టీచర్లును చూసి కూడా.. పట్టించుకోని సదరు కిడ్నాపర్లు ఓ తరగతి గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నారు. అక్కడి నుంచి బాలిక తండ్రికి ఫోన్ చేసిని కిడ్నాపర్లు తమ డిమాండ్ మేరకు రెండు కోట్ల రూపాయలు ఇస్తేనే.. వారి బాలుడిని వదిలేస్తామని లేదంటే.. తమ బాలుడిని చంపేస్తామని హెచ్చరించారు.
ఊహించని ఘటనతో తొలుత షాక్ తిన్న బాలుడి తండ్రి ఆ తర్వాత వేగంగా స్పందించారు. వెనువెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగిపోయిన పోలీసులు పాఠశాలను రౌండప్ చేశారు. క్షణాల్లో లోపలకు చొచ్చుకు వెళ్లి, కిడ్నాపర్లు ఉన్న గది తలుపులను బద్దలు కొట్టారు. కిడ్నాపర్లు తేరుకునేలోగానే చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు వారి చేతుల్లోని తుపాకులు లాగేశారు. వెనువెంటనే కిడ్నాపర్ల చేతులకు బేడీలు వేశారు. ఆపై నాలుగు తగిలించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనలో బాలుడికి చిన్నపాటి గాయం కూడా కాలేదు.
అనంతరం కిడ్నాప్ కు సంబంధించిన వివరాలను గజియాబాద్ ఎస్ పీ అజయ్ పాల్ శర్మ వివరిస్తూ.. బాలుడి కిడ్నాప్ చేసిన ముగ్గురు నిందితులు బిట్టూ, దీపక్, సందీప్ లను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. బాలుడితో స్నేహపూర్వకంగా మెలగడం కోసం అంతకుముందు వారి ప్రణాళికలో భాగంగా అతడితో క్రికెట్ అడారని చెప్పారు. ఈ నెల 29న బాలుడిని కిడ్నాప్ చేశారని, కాగా వారి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ట్రేస్ చేయడంతో పాటు స్థానికులను వారి గురించి ఎప్పటికప్పుడు విచారించడంతో బాలుడిని సురక్షితంగా వారి నుంచి కాపాడగలిగామని శర్మ తెలిపారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more