హైదరాబాద్లో మెట్రోకు సంబంధించి ఎటువంటి మార్పులు చేయడం లేదని, పాత అలైన్మెంట్ ప్రకారమే మెట్రో పనులు నిర్వహిస్తున్నామని ఎల్అండ్టీ మెట్రో సీఈవో, ఎండీ వీబీ గాడ్గిల్ తేల్చి చెప్పడంతో సుల్లాన్ బజార్ వ్యాపారస్థులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ వారు స్వచ్చంధంగా బంద్ పాటిస్తున్నారు. దుకాణాలను మూసివేసి.. మెట్రో రైల్వే అలైన్ మెంట్ ను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇన్నాళ్లు తమ పక్షాన మాట్లాడిన ప్రభుత్వం ఒక్కసారి మౌనంగా వుండటంలో అంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు.
నగరంలోని చారిత్రాత్మక కట్టడాలు, పలు వాణిజ్య కేంద్రాల నుంచి మెట్రలో వెళ్లినచ్చేది లేదని భీష్మించిన ప్రభుత్వ మాటమార్చి పాల అలైన్ మెంట్ ప్రకారమే పనులు పూర్తి చేయాలని అదేశించడంమేంటని వారు నిలదీస్తున్నారు. నిన్న మీడియాతో మాట్లాడిన మెట్రో సీఎండి గాడ్డిల్. అసెంబ్లీ ముందు, సుల్తాన బజార్లో మెట్రో పనులు యథాతథంగా జరుగుతున్నాయని స్పష్టం చేయడంతో సుల్తాన్ బజార్ లో ఆగ్రహజ్వాలలు మిన్నంటాయి.
అయితే పాతబస్తీలో మెట్రో అలైన్మెంట్పై చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. దేశంలో ఇతర మెట్రో స్టేషన్లలో ఎక్కడా కనిపించని విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రయాణికులను ఆకర్షించేలా నాగోల్ మెట్రో స్టేషనలో ఏర్పాటు చేసిన రిటైల్ షాప్ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మెట్రో స్టేషన్లలో విభిన్నమైన రిటైల్ స్టోర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి నగరంలో మెట్రో రైల్ సేవలు ప్రారంభించే అవకాశాలున్నాయని సూచనప్రాయంగా తెలిపారు.
ప్రస్తుతం మియాపూర్-ఎస్ ఆర్నగర్ రూట్లో మెట్రో ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ‘‘ప్రభుత్వ ఆదేశాల మేరకే పాతనగరంలో ఫలక్నామా మెట్రో డిపోతో పాటు మెట్రో మార్గం పనులు చేపడుతున్నాం. మూసీ నది మధ్య నుంచి మెట్రో పనులు చేపట్టడం సాంకేతికంగా పలు సవాళ్లతో కూడుకుని ఉందన్నారు నాగోలు- సికింద్రాబాద్ రైల్వే స్టేషన మార్గంలో బోయిగూడ, ఆలుగడ్డబావి, ఎలిఫెంటా బ్రిడ్జి ప్రాంతాల్లో రైలు ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ)లను వచ్చే ఏడాది నవంబర్నాటికి పూర్తి చేస్తే ఈ మార్గంలో మెట్రో రైళ్లు పరుగులు తీసే అవకాశాలున్నాయి గాడ్గిల్ తెలిపారు. నగరంలోని 64 మెట్రో స్టేషన్లలో క్విస్ రెస్టారెంట్లు, లార్జ్ ఫార్మాట్ పుడ్ కోర్ట్స్, ఏటీఎం, మెడికల్ స్టోర్లు, లాండ్రీ సెంటర్లు ఇలా అన్నీ అందుబాటులో ఉంటాయన్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more