వరంగల్ కోటలో జెండా ఎగురేసే వీరుడెవరో మరికొద్ది గంటల్లో తేలనుంది. వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నిక ఓట్లలెక్కింపు కొద్ది గంటల్లో మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్నది. గతం కంటే పోలింగ్ శాతం తగ్గడంతో దానివల్ల ఎవరు లబ్ధి పొందుతారన్నది అంశంపై ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తామే విజయం సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఓరుగల్లు ఓటరు తీర్పు మరికొన్ని గంటల్లో వెల్లడి కానుంది..ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా భావించిన వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికల కౌంటింగ్... ఉత్కంఠకు గురి చేస్తోంది. ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్న ఓటర్ తీర్పు ఎలా ఉంటుందోనన్న ఆందోళన అన్ని పార్టీల్లో ఉన్నా...ఎవరికి వారే విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్ పైనే అందరి దృష్టీ ఉంది.
వరంగల్ లోక్ సభ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కౌంటింగ్ జరుగుతుంది. ఒక్కో నియోజకవర్గంలోని 14 పోలింగ్ కేంద్రాలను ఒక్కో రౌండ్ గా విభజించి ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రంలో అన్ని టేబుల్స్ దగ్గర ఉండే ఏజెంట్లకు పాస్ లు మంజూరు చేశారు. 8గంటలకు లెక్కింపు ప్రారంభమైన వెంటనే మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. ఫస్ట్ రౌండ్ రిజల్ట్..9గంటలకు వెల్లడయ్యే అవకాశం ఉంది. అధికార టీఆర్ ఎస్ తో పాటు..కాంగ్రెస్,బీజేపీ,వైసీపీ,వామపక్షాల అభ్యర్థులు ప్రధానంగా బరిలో ఉన్నారు. పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ ఎన్నికల కౌంటింగ్ పై ఎంతో ఉత్కంఠ నెలకొంది. దీంతో...ఎన్నికల కౌంటింగ్ సక్రమంగా జరిగేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రం చుట్టూ...మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. 2014 ఎన్నికల్లో కన్నా ఈసారి పోలింగ్ శాతం తగ్గింది. గతం కంటే పోలింగ్ శాతం 7.92 శాతం తగ్గడంపై చర్చ సాగుతుంది. పోలింగ్ శాతం తగ్గడంతో తమ మెజార్టీ తగ్గుతుందని గులాబీ నేతలు ఆందోళన చెందుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more