ఆమె ఐదుగురు పిల్లల తల్లి.. అప్పటికే ఇద్దరితో సంబంధం పెట్టుకుని వారి నుంచి విడిపోయిన ఆమె.. గతంలో ప్రేమించిన మాజీ ప్రియుడితో మళ్ళీ సంబంధం పెట్టుకుంది. అతనితో ఎప్పుడుపడితే అప్పుడు చట్టాపట్టాలేసుకుని తిరగడం, ఇంట్లోనే సరసా సల్లాపాలు కొనసాగించడం లాంటి వ్యవహారాలు కొనసాగిస్తూ వచ్చింది. తనకు ఐదుగురు పిల్లలు వున్నారనే సరైన ధ్యాస లేకుండా వారిని ఇంట్లోనే వదిలేసి తన ప్రియుడితో బయటకు షికార్లకు వెళ్ళేది. ఈమె ఈ నిర్లక్ష్యానికి ఓ పసిపాప ప్రాణాలు బలయ్యాయి. ఓరోజు తన బాయ్ ఫ్రెండ్ తో పిజ్జా తినడానికి బయటకెళ్ళిన ఈ మహాతల్లి.. పిల్లల్ని ఇంట్లో పెట్టి తాళం వేసుకెళ్ళింది. ఇంట్లోనే వున్న పిల్లలు సరదాగా ఆడుకుంటూ తమ 19 నెలల చెల్లల్ని ఓవెన్ పెట్టి, స్విచాన్ చేశారు. దాంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయవిదారకమైన ఈ ఘోరం అమెరికాలోని హ్యూస్టన్లో జరిగింది.
రాకెల్ థామ్సన్ అనే మహిళకు ఐదుగురు పిల్లలు వున్నారు. ఈమె అప్పటికే ఇద్దరితో సహజీవనం చేసి వదిలేసింది. ఇక ఒంటరిగా తన పిల్లలతో జీవితం కొనసాగిస్తున్న ఈమెకు గతంలో ప్రేమించిన మాజీ ప్రియుడు ఫ్రెడ్రిక్ ప్రైస్ గుర్తొచ్చాడు. అంతే! అతనిని తన ఇంటికి పిలపించి, ఆగిపోయిన తమ ప్రేమను కొనసాగిద్దామని చెప్పింది. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే అతగాడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. అప్పటినుంచి చట్టాపట్టాలేసుకుని తిరగడం ప్రారంభించారు. ఇంట్లోనే శృంగార కార్యకలాపాలు కొనసాగించడం, ఎప్పుడపడితే అప్పుడు అతనితో బయటికెళ్ళడం లాంటివి చేస్తూ వచ్చింది. అయితే.. అతడు ఎప్పటినుంచి ఆమెకు దగ్గరయ్యాడో అప్పటినుంచి పిల్లల్ని అంతగా పట్టించుకునేది కాదు. ఇంట్లోనే వదిలేసి బాయ్ ఫ్రెండ్ తో జల్సాలకు వెళ్లేంది. ఈ తరహాలోనే ఓ రోజు తన బాయ్ఫ్రెండ్తో కలసి పీజా ఆరగించడానికి డామినోస్కి వెళుతూ.. తన ఐదుగురు పిల్లల్ని ఇంట్లో పెట్టి తాళం వేసేసింది. జైరా అనే 19 నెలల చిన్నారి తప్ప మిగిలిన నలుగురూ సుమారు మూడేళ్ళు, ఆపై వయసు పిల్లలే. వీళ్లందరూ సరదాగా ఆడుకుంటున్న తరుణంలో.. జైరాను ఓవెన్లో పెట్టి స్విచాన్ చేశారు. ఆ వేడికి ఆ చిన్నారి కాలిపోయి మరణించింది. బాయ్ ఫ్రెండ్ తో చక్కర్లు కొట్టి ఇంటికి తిరిగొచ్చిన తర్వాత ఆమె ఈ ఘటనను చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. తాను చేసిన నిర్లక్ష్యానికి పాపను పోగొట్టుకోవలసి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన రాకెల్పై కేసు నమోదు చెయ్యడానికి యూఎస్ పోలీసులు కసరత్తు మొదలుపెట్టారు.
ఇదివుండగా.. రాకెల్ ఐదుగురు పిల్లలలో ఇద్దరు మాజీ బాయ్ఫ్రెండ్ ఫ్రెడ్రిక్ ప్రైస్ ద్వారా పుట్టారు. ఇప్పుడు ఓవెన్లో మరణించిన జైరాకు తండ్రిని తానే కావచ్చునంటూ ఫ్రెడ్రిక్ వచ్చాడు. రాకెల్ చేసిన నిర్లక్ష్యానికి పాప మరణించడంతో.. ఫ్రెడ్రిక్ తన పిల్లలను తనే పెంచుకోవడానికి చట్టబద్ధమైన ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ పిల్లల్లో ఒకరి బామ్మ అదే అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉంటున్నారు. ఆమెకైనా చెప్పకుండా రాకెల్ తన ప్రస్తుత బాయ్ఫ్రెండ్తో వెళ్లిపోవడంపై అపార్ట్మెంట్ వాసులు దుమ్మెత్తి పోస్తున్నారు. వారం రోజుల నుంచీ కలకలం రేపుతున్న ఈ కేసు చైల్డ్ ప్రొటెక్టివ్ సర్వీసెస్ దర్యాప్తులో ఉంది. ఇంకో విషయం ఏమిటంటే.. ఆమె తన ప్రస్తుత బాయ్ఫ్రెండ్ ద్వారా మరోసారి గర్భవతి అయ్యింది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more