గమ్యస్థానానికి చేరుస్తానని ఓ సాఫ్ట్ వేర్ కుటుంబాన్ని తన ఆటోలో కూర్చోబెట్టుకున్న ఓ డ్రైవర్.. విచక్షణారహితంగా వాహనాన్ని నడిపి ఘోర ప్రమాదానికి దారితీశాడు. ఆ యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి చేర్చాల్సిందిపోయి.. వారి దగ్గరున్న సొమ్ము దోచుకుని అడ్రెస్ లేకుండా పరారయ్యాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. తీవ్ర కలకలం రేపిన ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించగా.. అతని భార్య, కొడుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సుబోధ్ శ్రీవాస్తవ్ (42) తన భార్య సుష్మ, కొడుకు ప్రియన్ తో కలిసి ఛత్ పూజ కోసం బీహార్ లోని సొంత ఊరికి వెళ్ళాడు. ఆ కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి తన కుటుంబంతో ఢిల్లీకి పయనమయ్యాడు. ఈ నేపథ్యంలో అనంద్ విహార్ రైల్వే స్టేషన్ లో దిగాడు. అక్కడినుంచి ఇంటికి రావడానికి వారు ఆటో మాట్లాడుకున్నారు. అయితే.. వాహనాన్ని అతివేగంగా నడుపుతున్న ఆటో డ్రైవర్ ను శ్రీవాస్తవ్ రెండు సార్లు వారించాడు. అయినా వినకుండా మరింత వేగం పెంచాడా డ్రైవర్. దీంతో అదుపు తప్పిన ఆటో.. డివైడర్ ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో శ్రీవాస్తవ్ ఆటో కిందపడి చనిపోయాడు. అతని కొడుకు, భార్య కాస్త దూరంగా పడి తీవ్ర గాయాలకు గురయ్యారు. ఈ దారుణానికి కారకుడైన ఆటోడ్రైవర్ ఆ బాధితులను ఆదుకోవాల్సిందిపోయి.. వారికి సంబంధించిన మూడు బ్యాగులను, ల్యాప్ ట్యాప్ ను తీసుకుని అక్కడినుంచి ఉడాయించాడు. శ్రీవాస్తవ్ భార్య సుష్మ మెల్లగా కోలుకుని సాయం కోసం అర్థించగా.. కొందరు వ్యక్తులు ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన గురించి సుష్మ మాట్లాడుతూ.. వేగంగా నడపొద్దని తన భర్త వారించినా వినకుండా డ్రైవర్ దుర్భాషలాడుతూ మరింత వేగం పెంచాడని ఆరోపించింది. దీంతో ఆటో తిరగబడి పోయిందని, ఈ ఘటనలో తన భర్త ఆటో కింద చనిపోగా.. కొడుకు దూరంగా పడిపోవడం తనకు గుర్తుందని తెలిపింది. ఆటోను పక్కకు తీసిన డ్రైవర్ సామాగ్రి ఆటోలో పెడుతోంటే, తమకు సాయం చేస్తున్నాడనుకున్నాననీ, కానీ తమ బ్యాగులు తీసుకుని అక్కడినుంచి పరారవుతాడని అస్సలు ఊహించలేదని ఆమె తెలిపింది. ఆ తరువాత మెల్లిగా తేరుకుని, ఆ దారిన వెళుతున్న వాహనదారులను సాయమడిగి ఆసుపత్రికి చేరామంటూ ఆ దుర్ఘటను గుర్తు చేసుకుంది. తన భర్త మరణానికి కారణమైన ఆ ఆటోడ్రైవర్ ని గుర్తు పడతానని తెలిపారు. ప్రస్తుతం ఆ ఆటోడ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more