జీవితంలో ఒక్కసారే చేసుకునే పెళ్లి జీవితాంతం గుర్తుండేలా చేసుకోవాలని, తమ భావి తరాలకు ఆదర్శప్రాయంగా ఉండాలని ఎంతో మంది కాబోయే వధువరులు కలలు కంటుంటారు. అట్టహాసాలు, అడంబరాలకు ఏమాత్రం కొదవలేకుండా తమ బంధుమిత్రులందరినీ ఆహ్వానించి పెళ్లి చేయాలనుకుంటారు వధూవరుల తల్లిదండ్రులు. అప్పటి వరకు మన్స్పర్థలతో దూరమైనవారిని కూడా తమ సంతానం పెళ్తికి ఆహ్వానిస్తుంటారు పెద్దలు. ఇక పెళ్లి హడావిడిలో తమ దూరపు బంధువులను మర్చిపోతే.. ఇంకేముంది.. ఏదో ఒక అలాంటి వేడుకలోనే వారి పరుపుపోయేలా చులకన చేసి మాట్టాడటం.. లేదా అసలు చూసిచూడనట్లు వ్యవహరించడం బంధువులకు అలవాటే. అయితే కర్ణాటకలో మాత్రం ఇక బంధువులకు ఈ ఆలకలు అలవాటు కావాల్సిందే.
ఎందుకంటారా.. లక్షలు... కోట్ల రూపాయలు... ఖర్చు చేసి ధూంధాం... అంటూ బంధువులందరినీ పెళ్లికి పిలవడం ఇక కుదరకపోవచ్చు. ఎందుకంటే ఇలాంటి ఆడంబరాల పెళ్లిళ్లకు అడ్డుకట్ట వేయడానికి వీలుగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఈ మేరకు రూపొందించిన ముసాయిదా బిల్లును శాసనసభలో సభ్యుల అనుమతి కోసం ప్రవేశపెట్టింది. ముసాయిదా బిల్లులో ముఖ్య నిబంధనల ప్రకారం.. కల్యాణ మండపం అద్దె రూ. 50 వేలకు మించకూడదుట, అంతేకాదు అతిథిలు 300కు కంటే ఎక్కువ మంది హాజరుకాకూడదట వీటితో పాటు పెళ్లికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది కర్ణాటక ప్రభుత్వం. నిబంధనలు ఉల్లంఘిస్తే వధూవరుల తల్లిదండ్రుల నుంచి అపరాధ రుసుమును వసూలు చేస్తామని కూడా హెచ్చరిస్తుంది. అయితే ప్రభుత్వ నిర్ణయం పట్ల రాష్ట్రంలో విమర్శలు చెలరేగుతున్నాయి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more