పారిస్ మహానగరంలో ఉగ్రదాడి మోగించిన మరణమృదంగంతో ఎక్కడ చూసిని శ్మశాన వాతావరణం అలుముకుంది. పారిస్ వ్యాప్తంగా భీతావహ వాతవరణం నెలకొనగా, అక్కడి ప్రజల్లో ఇంకా గుండెల్లో ఎక్కడో ఓ మూల భయాందోళన పోంచివుంది. మరిన్నీ దాడులు జరుగుతాయన్న అనుమానాల నేపథ్యంలో అంతర్జాతీయ సరిహద్దులన్నింటినీ మూసివేసిన ఫ్రాన్సు దేశంలో అత్యవసర పరిస్థితి విధించింది, మూడు రోజులు సంతాప దినాలను ప్రకటించిన నేపథ్యంలో ఎక్కడ చూసినా విషన్నవదనాలు, శోకతప్త హృదయులైన పౌరులే కనబడ్డారు. ముష్కరమూకల భీకరదాడిలో అసువులు బాసిన తమ బంధువులు, సన్నిహితులకు పారిస్ ప్రజలు రంగురంగుల కొవ్వోత్తులు వెలిగించి నివాళులర్పిస్తున్నారు. దాడుల్లో నష్టపోయినా, గాయపడినా, వెన్ను చూపేదిలేదనే సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. నిబ్బరంగా, ధైర్యంగా ఇస్లామిక్ టెర్రరిజాన్ని ఎదుర్కొని తీరతామంటున్నారు.
అటు ప్రపంచ దేశాలన్నీ పారిస్ మారణహోమాన్ని తీవ్రంగా ఖండించాయి. ఈ దారుణ మారణఖాండలో అసువులు బాసిన వీరులకు ప్రపంచ దేశాలు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపాయి. వారి కుటుంబసభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశాయి. మరోవైపు పారిస్లో నరమేధానికి పాల్పడింది తామేనని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్, సిరియా) ప్రకటించుకున్నది. పారిస్ దాడికి ఒకరోజు ముందు ఫ్రాన్స్ను హెచ్చరిస్తూ ఐఎస్ఐఎస్ విదేశీ మీడియా విభాగం అల్ హయత్ మీడియా సెంటర్ ఓ వీడియోను ఆన్లైన్లో పోస్ట్ చేసింది. సిరియాలో దాడులు ఆపకపోతే.. మిమ్మల్ని ప్రశాంతంగా బతుకనివ్వమనే హెచ్చరికలు జారీ చేసింది. దీనికి సంబంధించి అరబిక్ భాషలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. పారిస్ దాడికి ఒకరోజు ముందు ఆ వీడియో విడుదల చేయడం.. దాడికి పాల్పడింది తామేనని ఐఎస్ఐఎస్ ప్రకటించడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తుంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more