ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ మరో బలిదానం జరిగింది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన దుర్గా ప్రసాద్ ఆగస్టులో ఒంటికి నిప్పంటించుకున్నారు. అప్పటి నుండి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. నేటి ఉదయం తుది శ్వాసవిడిచారు. తెలుగు రాష్ట్రాలుగా ఏపి, తెలంగాణ విడిపోయిన తర్వాత ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్ ఊపందుకుంది. దాంతో చాలా మంది ప్రత్యేక హోదా కోసం తమ తనువులను చాలించారు. కేంద్ర ప్రభుత్వం ఏపికి ప్రత్యేక హోదా కేటాయిస్తుందా..? లేదా అన్న దాని మీద ఇప్పటి వరకు కూడా క్లారిటీ రాలేదు. దాంతో ప్రత్యేక హోదాను కోరుతూ ఉద్యమం ఉదృతమైంది.
తాజాగా హోదా కోసం అమరుడైన దుర్గాప్రసాద్ వ్యవహారంతో మరోసారి ఏపిలో ఉద్యమం మొదలయ్యే అవకాశాలున్నాయి. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపికి ప్రత్యేక హోదా కల్పించేందుకు ముందు రావడం లేదు. ప్రత్యేక హోదా మీద ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండానే కాలం వెళ్లదీస్తోంది. చంద్రబాబు నాయుడు కూడా ఏపికి ప్రత్యేక హోదా మీద ఎలాంటి వత్తిడి చెయ్యడం లేదు. చేపినట్లు అనిపిస్తున్నా... అవి పెద్దగా ఫలితాలనివ్వడం లేదు. దుర్గాప్రసాద్ మృతితొ మరోసారి ప్రత్యేక హోదా అంశం తెర మీదకు వచ్చింది. వైసీపీ నాయకులు మాత్రం ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే అని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more