దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలు ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియాకి తగిన శాస్తే జరిగిందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 2012 ఏప్రిల్ నెలలో తన కన్నకూతురు 24 ఏళ్ల షీనాబోరాను ఇంద్రాణి తన మాజీ భర్త ఖన్నా, డ్రైవర్ శ్యామ్ తో కలిసి హత్య చేసిన విషయం తెలిసిందే! ఈ కేసును విచారించిన పోలీసులకు చాలా చుక్కలు కనిపించాయి. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలా తలపించే విధంగా ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకి వచ్చాయి. చివరకు షీనాని చంపింది తల్లి ఇంద్రాణియేనని పోలీసులు తేల్చేశారు. ఈ కేసులో ఆమెను పోలీసులు గత ఆగస్టు 25న అరెస్ట్ చేశారు.
ప్రస్తుతం బైకుల్లా జైల్లో వున్న ఈమె.. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ఎన్నో జగన్నాటకాలు ఆడిన విషయం విధితమే! ఈ నెల ప్రారంభంలో ఆమె అకస్మాత్తుగా అపస్మారక స్థితికి వెళ్లి అటు జైలు అధికారులతోపాటు షీనా కేసు దర్యాప్తు అధికారులను కలవరపెట్టింది. అప్పుడు ఆమె ఈ కేసునుంచి తప్పించుకునే భాగంలోనే ఈ నాటకం ఆడిందని అనుమానించారు. నిజానికి ఆమె నిజంగా అనారోగ్య బారిన పడిందో లేదో తెలీదు కానీ.. డాక్టర్లు కొద్దిరోజులపాటు చికిత్స చేసి తిరిగి ఆమెకు జైలు తలరించారు. జైలుకు తిరిగొచ్చిన వెంటనే ఈమె విచారణలో భాగంగా సంచలన విషయాలను బట్టబయలు చేసింది. తన కూతురు షీనాను తాను చంపలేదని, తన మాజీ భర్త ఆమె భవిష్యత్తుపై కలవరం పెంచుకుని ఆ ఆవేదనలో చంపేశాడని తెలిపింది. అందుకు డ్రైవర్ శ్యామ్ సహకరించినట్లుగా ఆమె చెప్పింది. ఆమె వాంగ్మూలం ప్రకారమే జైలు అధికారులు విచారణ చేపట్టారు కూడా. అయితే.. ఆమె అరెస్టు రోజు మొదలుకుని ఇప్పటివరకు ఎన్నో కహానీలు సృష్టించినందుకుగాను ఇప్పుడు తగిని శాస్తి జరిగిందని చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఆమెకు ఏమైంది? అనేగా సందేహం. ఆ వివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్ళాల్సిందే!
రిమాండ్ ఖైదీగా జైల్లో వున్న ఇంద్రాణి ముఖర్జియా ఈసారి నిజంగానే అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. గత ఏడు రోజులుగా ఆమె డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నట్లు ఆమె ఆరోగ్య పరిస్థితిపై పోలీసులు కోర్టుకు వివరించినట్లు సమాచారం. ఆమె రక్తంలో ప్లేట్ లెట్స్ సంఖ్య సాధారణ స్థాయి నుంచి 65,000కు పడిపోయిందని వారు న్యాయస్థానానికి తెలిపారు. తొలుత ఆమెకు వైద్యులు జైలులోనే చికిత్స అందించగా.. పరిస్థితిలో మార్పులేని పక్షంలో ఆమెను దగ్గరలోనే జెజె ఆసుపత్రికి తలరించారని తెలిసింది. కాగా, ఇంద్రాణి ఫోన్ కాల్స్ కు సంబంధించిన కొన్ని రికార్డులు తమకు లభ్యమయ్యాయని, ఆమె వాయిస్ ను సరిపోల్చుకోవడానికి ఆమె స్వర నమూనాలను పంపాలని కేసును విచారిస్తున్న సీబీఐ జైలు అధికారులను కోర్టు ఆదేశించింది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more