వచ్చే ఏడాది జనవరి నుండి కేంద్ర ప్రభుత్వం చేపట్టే గ్రూప్ బి, సి, డి పోస్టుల నియామకాలకు కేవలం రాత పరీక్షలలో కనబరిచిన ప్రతిభ ఆధారంగానే నియామకాలు చేపట్టనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. తక్కువ శ్రేణి ఉద్యోగాలకు ఇంటర్వ్యూను తొలగించే ప్రక్రియ పూర్తయిందని అన్నారు. ఆదివారం 'మన్ కీ బాత్' కార్యక్రమం ద్వారా ప్రధాని మాట్లాడుతూ.. అవయవ దానం చాలా ప్రాముఖ్యత గల అంశమన్నారు. కేరళ నుంచి కొందరు బాలికలు, ఢిల్లీ నుండి దివేష్ అనే బాలుడు అవయవ దానం గురించి మాట్లాడాలని కోరినట్లు చెప్పారు. అవయవ దానాన్ని కొన్ని రాష్ట్రాలు సులువుగా మార్చాయని పేర్కొన్నారు. తమిళనాడు ఈ విషయంలో బాగా కృషి చేస్తుంది. ముఖ్యమైన అవయవాలైన కిడ్నీలు, గుండె మార్పిడిలో అవయవదానం మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆదర్శ గ్రామ యోజన పథకంలో ఎంపీలు చురుగ్గా పాల్గొంటున్నారన్నారని మోదీ కితాబిచ్చారు. బంగారు నగదీకరణ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపిన మోదీ అశోక చక్ర ఉన్న బంగారు నాణేన్ని విడుదల చేస్తామని ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఆర్థిక భద్రత గల పథకాలను ప్రవేశపెడుతామన్నారు. స్వచ్ఛ భారత్ విషయంలో మీడియా కృషికి ధన్యవాదాలు తెలిపారు. భారత్, ఆఫ్రికా సదస్సు గురించి మాట్లాడుతూ.. భారత్, ఆఫ్రికాల మధ్య చాలా అంశాలలో సారూప్యత ఉంది. భారత సంతతీయులు చాలా మంది ఆఫ్రికాలో ఉన్నారు. ఈ రోజు ముంబైలో జరగనున్న దక్షిణాఫ్రికా-భారత్ ఐదవ వన్డే రసవత్తరంగా ఉంటుందనే ఉత్సుకతను మోదీ వ్యక్తం చేశారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more