సామాజిక మాధ్యమాలు కేవలం సొల్లు చెప్పుకోవడానికే కాకుండా అప్పుడప్పుడు మంచి పనులకూ ఉపయోగిపడుతున్నాయని చెప్పుకోవడానికి తాజా సంఘటనను ఉదాహరణగా తీసుకోవచ్చు. తప్పిపోయిన రెండేళ్ల కూతురిని ఈ వాట్సాప్ నిముషాల వ్యవధిలోనే కలిపేసింది. దీంతో ఆ తల్లి ఆనందం అంతుపట్టనిది. ఈ ఘటన వరంగల్ జిల్లా కేసముద్రంలో జరిగింది.
దసరా పండుగ వాతావరణం కాబట్టి.. చిట్టె సునీత అనే మహిళ తన రెండేళ్ల కూతురు రచనతో కలసి కొత్త బట్టలు కొనేందుకు ఓ షాపుకు వెళ్లింది. తల్లి బట్టలు సెలక్ట్ చేయడంలో నిమగ్నం కాగా, పాప బయటకు వచ్చి దగ్గర్లోని రైల్వేస్టేషన్ వద్దకు నడుస్తూ వెళ్లిపోయింది. అక్కడ దిక్కుతోచని పాప ఏడుస్తూ ఉండగా, ఓ ఆటో డ్రైవర్ ఆమెను చూశాడు. వెంటనే స్పందించిన ఆ డ్రైవర్.. పాప తల్లిదండ్రుల కోసం ఆచూకీ తీశాడు. ఎవరూ తమ పాపేనని ముందుకు రాలేదు. మరోవైపు షాపు వద్ద పాప కనిపించక ఆ తల్లి తల్లడిల్లుతున్న తీరు అందరినీ కలచివేసింది. ఇంతలోనే తప్పిపోయిన పాపతో వున్న ఆటోడ్రైవర్ వద్దకు వెంకటేష్ అని వ్యక్తి వచ్చాడు. ఏమైందంటూ అతను ఆరాతీయగా.. ఆ డ్రైవర్ పాప తప్పిపోయిందని చెప్పాడు. దీంతో వెంకటేష్.. వెంటనే తన సెల్ నుంచి సెల్ నుంచి పాప ఫోటో తీసి, మొత్తం విషయాన్ని వివరిస్తూ, దాన్ని తన సెల్ ఫోన్ వాట్సాప్ లోని అన్ని కాంటాక్టు నంబర్లకూ పంపాడు.
అక్కడి నుంచి నిమిషాల్లో కేసముద్రంలోని అన్ని స్మార్ట్ ఫోన్లకూ చేరిపోయింది. ఓ హోటల్ యజమాని స్మార్ట్ ఫోన్ కూ ఈ మెసేజ్ అందింది. ఆ మెసేజ్ లో వున్న బిడ్డ ఫోటో చూసి, తన హోటల్ ముందు పాప కనపించక ఏడుస్తూ వెతుకుతున్న తల్లికి చూపాడు. ఆ పాప తన బిడ్డేనంటూ తల్లి ఆనందంలో మునిగిపోయింది. చివరగా.. వారిద్దరు కలిసిపోయారు. ఇలా విడిపోయిన తల్లీకూతుళ్లను నిముషాల వ్యవధిలోనే కలిపిన వాట్సాప్ యాప్ కు అందరూ హ్యాట్సాఫ్ చెప్పుకున్నారు. అలాగే.. తెలివిగా వ్యవహరించిన వెంకటేష్ ని అందరూ ప్రశంసించారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more