మ్యాగీ నూడుల్స్ వివాదం ఒక్క అడుగు ముందుకు.. రెండగులు వెనక్కు అన్నట్లగా సాగుతోంది. మ్యాగీని మరోమారు భారతీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు నెస్లే ఇండియా సంస్థ చేస్తున్న ప్రయాత్నాలు మళ్లీ మొదటికోచ్చాయి. మ్యాగీ నూడుల్స్ శాంపిల్స్ను మరోసారి పరీక్షించాలని వినియోగదారుల అత్యున్నత న్యాయస్థానం గురువారం ఆదేశించింది. తొమ్మిది బ్యాచ్లకు చెందిన 9 మ్యాగీ పాకెట్లను గుర్తింపు పొందిన ల్యాబ్స్లో టెస్ట్ చేయాలని పేర్కొంది. అధిక మోతాదులో సీసం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో పలు రాష్ట్రాలు మ్యాగీ నూడుల్స్ను నిషేధించాయి. దీంతో మొన్నటి వరకు చిన్నా పెద్దా అందరూ అమితంగా ఇష్టపడి తినే మ్యాగీ నూడుల్స్ అమ్మకాలు దేశ వ్యాప్తంగా నిలిచిపోయాయి. దీనిపై కోర్టును ఆశ్రయించిన నెస్లే ఇండియా కంపెనీ తమ ఉత్పత్తులు నాణ్యమైనవేనని వాదిస్తోంది.
దీంతో జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ మ్యాగీ నూడుల్స్ను మరోసారి పరీక్షించాలని నిర్ణయించింది. మ్యాగీ ప్యాకెట్ల సీల్ తనిఖీ చేసిన తర్వాతే వీటిని పరీక్షకు పంపాలని పేర్కొంది. ఈ శాంపిల్స్ సేకరించేందుకు జాతీయ, ఆహార భద్రత స్టాండర్డ్స్ అథారిటీని అనుమతించాలన్న ప్రభుత్వ న్యాయవాది డిమాండ్ను వినియోగదారుల అత్యున్నత కోర్టు తిరస్కరించింది. ఒకవేళ ఈ పరీక్షల్లో గట్టెక్కితే మ్యాగీ నూడుల్స్ మార్కెట్లలో కనిపించే అవకాశముంది. తమ బ్రాండెట్ ఉత్పత్తి అయిన మ్యాగీని తిరిగి మార్కెట్లోకి తెచ్చేందుకు నెస్లే ఇండియా సంస్థ శతవిధాలుగా ప్రయత్నిస్తోంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more