పాకిస్ధాన్ కుట్రలు, కుతంత్రాలు నెరపడం కొత్తేమీ కాదు. తప్పులన్నీ తానే చేస్తూ, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ.. నెపాన్ని మాత్రం ఇతరులపైకి తోసేయడం పాక్ కు వెన్నతో పెట్టిన విద్య అన్న విమర్శలు ఉవ్వెత్తున్న వినబడుతున్నాయి అయితే అబద్దాన్ని నిజమని చెప్పి ఎల్లకాలం ఎవరినీ నమ్మించలేమన్నది వాస్తవం. ఇప్పుడదే వాస్తవం వెలుగుచూసే సరికి పాకిస్తాన్ అసులు రంగు మరోమారు భట్టబయలైంది. స్వయంగా ఆ దేశానికి చెందిన మాజీ రక్షణ శాఖమంత్రి ఓ భారతీయ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యావత్ ప్రపంచం విస్తుపోయేలా బాంబు పేల్చారు.
అల్ ఖాయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ గురించి పాకిస్థాన్కు ముందే తెలుసని, తమ దేశమే అతడికి ఆశ్రయం కూడా ఇచ్చిందని పాకిస్థాన్ మాజీ రక్షణ శాఖమంత్రి చౌదరీ అహ్మద్ ముక్తార్ చెప్పారు. ఒసామాను తమ దేశం అత్యంత ప్రాధాన్యత గత అధితిగా చూసుకుందని కూడా చెప్పారు. అల్ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ తమ దేశంలోనే ఉన్నాడన్న విషయం నాటి అగ్రనేతలు ఆసిఫ్అలీ జర్దారీ, ఆర్మీ చీఫ్ అష్పాక్ కయానీ తదితరులకు తెలుసునని పాకిస్థాన్ రక్షణశాఖ మంత్రి చౌదరి అహ్మద్ ముక్తార్ వెల్లడించారు.
ఓ భారత పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చౌదరీ అహ్మద్ ముక్తార్ ఈ వ్యాఖ్యలను చేయడం ఇప్పుడు సంచలనం సృష్టించాయి. ఇప్పటివరకూ అబోటాబాద్లో లాడెన్ ఉన్నట్లు తమకు తెలియదని తమ ప్రమేయం లేకుండానే అమెరికా దాడులు జరిపి ఆయన్ను హత్య చేసిందని నమ్మిస్తూ వచ్చిన పాకిస్థాన్కు అహ్మద్ చేసిన వ్యాఖ్యలు ఇరకాటంలో పడేశాయి. తమకు తెలియకుండానే అమెరికా దళాలు అబోటాబాద్లోని లాడెన్ నివాసంపై దాడులు చేసి హతమార్చిందని యావత్ ప్రపంచాన్ని నమ్మించిన పాకిస్థాన్ ఇప్పడు కుడిదిలో పడిన ఎలుక పరిస్థితిని ఎదుర్కోంటోంది.
అహ్మద్ ఒక అబద్ధాలకోరు అని, ఆయన చెప్పేవన్నీ అసత్యాలని పాకిస్థాన్ ఆర్మీ మాజీ ఛీప్ , ఆర్మి జనరల్ పర్వేజ్ ముషరఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఆర్మీ ఉన్నతాధికారిగా కోనసాగిన రఖీద్ ఖురేషీ కూడా అహ్మద్ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. 'అహ్మద్ ముక్తార్ ఇలాంటి మాటలను అన్నారంటే తాను నమ్మలేకపోతున్నానన్నారు.. ఒక వేళ ఆయన నిజంగా ఈ మాటలు అంటే ముక్తార్కు ఏదో అయి ఉంటుంది. అయితే, పాక్ అధ్యక్షుడికి నాటి లాడెన్ గురించి ముందే తెలుసు అని అహ్మద్ అన్నట్లు తాను మాత్రం వినలేదని రషీద్ ఖురేషి అన్నారు. 2008 నుంచి 2012 మధ్య కాలంలో అహ్మద్ ముక్తార్ పాక్ రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more