అవును.. పదోతరగతి అర్హత గల వాచ్ మన్ ఉద్యోగం కోసం ఏకంగా ఎంబీఏ అబ్యర్థులు పరుగులు తీశారు. ఆశ్చర్యానికి గురి చేసే ఈ ఉద్యోగాల పరుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.. ఏపీలో ప్రభుత్వుద్యోగాల కరువు ఎంత మేర వుందో! ఆమధ్య ఉత్తరప్రదేశ్ లో ప్యూన్ ఉద్యోగానికి పీ.హెచ్.డీ హోల్డర్లు సహా లక్షల మంది అభ్యర్థులు పోటీపడితే.. ఇప్పుడు వాచ్మన్ జాబ్ కోసం వందలాదిమంది డిగ్రీ, ఎంబీఏ అభ్యర్థులు పరుగు తీసి వార్తల్లోకెక్కారు.
విశాఖపట్టణం జిల్లా విద్యుత్ శాఖలో ఖాళీగా వున్న రెండు నైట్ వాచ్ మన్ పోస్టులను భర్తీ చేయడం కోసం ఆ శాఖ శుక్రవారం పరుగుపందెం నిర్వహించింది. ఈ పందెంలో డిగ్రీ ఏం ఖర్మ.. ఎంబీఏ పాసైన అభ్యర్థులు కూడా పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. చాలాకాలం నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూసిన అభ్యర్థులకు.. ఇంతలోనే విద్యుత్ శాఖలో వాచ్మన్ ఉద్యోగాల కోసం రిక్రూట్ మెంట్ నిర్వహించనున్నారనే విషయం తెలియగానే.. అర్హత తగ్గ ఉద్యోగం కాకపోయినా పరుగు పోటీలో సత్తా చాటడానికి సిద్ధమయ్యారు.
జిల్లా విద్యుత్ శాఖ డిపార్టుమెంట్ విభాగంలో ఒక పోస్టు, ఏపీఈపీడీసీఎల్ జిల్లా హెడ్ ఆఫీస్లో మరో పోస్టు ఖాళీగా ఉన్నాయి. ఈ రెండు పోస్టులకు 462 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. విద్యుత్ శాఖ డిపార్టుమెంట్ విభాగంలో ఉద్యోగం కోసం ముడసర్లోవ వద్ద బీఆర్టీఎస్ రోడ్డులో శుక్రవారం ఉదయం ఆ శాఖ అధికారులు అభ్యర్థులకు పరుగు పోటీలు నిర్వహించారు. శనివారం హెడ్ ఆఫీస్లో వాచ్మన్ ఉద్యోగం కోసం పరుగు జరగనుంది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more