దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అరుషి తల్వార్ హత్యకేసులో ఓ సిబిఐ అధికారి తాజాగా ఒక మెలిక పెట్టారు. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకంటే ఎన్నో ట్విస్టుల మీద ట్విస్టులతో కొనసాగిన ఈ కేసు విచారణ ఇంకా తుదిదశకు రానే లేదు. ఈ కేసులో ఆరుషి తల్లిదండ్రులే దోషులని అనుమానాలు వున్నాయి కానీ.. అందుకు తగిన ఆధారాలు ఇంకా దొరకలేదు. ఏదేమైనప్పటికీ.. వారు ఈ కేసు విచారణలో భాగంగా మూడేళ్లపాటు పోలీస్ కస్టడీలో వుండి.. ఇటీవలే విడుదలయ్యారు. అయినప్పటికీ.. వారే దోషులు అయివుంటారని అనుమానాలు ఇంకా వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. తాజాగా ఈ కేసును మొట్టమొదట విచారించిన ఓ సిబిఐ అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఈ కేసును దర్యాప్తు చేసిన జాయింట్ డైరెక్టర్, ఇప్పుడు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లో విధులు నిర్వహిస్తున్న అరుణ్ కుమార్ తాజాగా ఈ కేసుపై తన అభిప్రాయాన్ని స్పందిస్తూ.. దోషులుగా ముద్రపడి జైలు శిక్ష అనుభవించిన ఆరుషి తల్లిదండ్రులు నిర్దోషులని వ్యాఖ్యానించారు.
‘నేను ఈ అభిప్రాయానికి రావడం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో.. హేమరాజ్ మృతదేహం అరుషి మృతదేహంతో పాటే లభించలేదు. అలాగే ఈ కేసులో ఫోరెన్సిక్ నమూనాల సేకరణ జరగలేదు. అదే జరిగివుంటే నిజం ఎంతో సులభంగా వెల్లడయ్యుండేది’ అని అరుణ్ కుమార్ అన్నారు. ‘ఈ కేసును విచారించిన రెండు సీబీఐ టీమ్ లూ ఎన్నటికీ ఒకే మాటపైకి రాలేదు. ఒక టీం అరుషిని హత్య చేసేందుకు వారి తల్లిదండ్రులు సహకరించారని చెప్పగా... రెండో టీమ్ పనివాడు హేమరాజ్ తో కలసి ఉన్న అరుషిని చూసిన తరువాత తల్లిదండ్రులే హత్య చేశారని చెప్పారు’ అని అన్నారు. సీబీఐ డైరెక్టర్ అశ్వని కుమార్ కేసు బాధ్యతలు స్వీకరించాక పరిస్థితి మొత్తం మారిపోయిందని ఆయన ఆరోపించారు. కేసు విచారణను ముగించే సమయంలో తనను అభిప్రాయం కోరారని.. అప్పుడు ఆయన "ఈ నేరంలో అరుషి తల్లిదండ్రులకు సంబంధమున్నట్టు ఒక్క ఆధారం కూడా లేదు’ అని స్పష్టం చేసినట్లు చెప్పారు. కానీ.. తాను ఎంతగా మొత్తుకున్నప్పటికీ.. ఎవరూ తన వాదనను వినలేదని అరుణ్ ఆరోపించారు.
అయితే.. డైరెక్టర్ల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు కారణంగానే కేసు తప్పుదారి పట్టిందా? అన్న ప్రశ్నకు అరుణ్ కుమార్ సమాధానం ఇవ్వలేదు. కాగా, ఈ కేసు ఆధారంగా నిర్మితమై ఇటీవల విడుదలైన 'తల్వార్' చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ చిత్రంలో అరుణ్ కుమార్ పాత్రను ఇర్ఫాన్ ఖాన్ పోషించాడు. ఈ సినిమా విడుదలై మంచి విజయంతో దూసుకుపోతున్న నేపథ్యంలో స్పందించిన అరుణ్ కుమార్.. ఆ చిత్రంలో ఇర్ఫాన్ చెప్పిన డైలాగులే ఇప్పుడు ఈయన నోటివెంట రావడం గమనార్హం.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more