ఆదాయపన్ను అధికారులు ఇటీవల సినీ నటుల ఇళ్లలో హఠాత్తుగా ఐటీదాడులు నిర్వహించిన విషయం తెలిసిందే! ఆ తనిఖీల్లో ఆశ్చర్యానికి గురిచేసే కొన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఐదేళ్ల నుంచి ట్యాక్స్ కట్టడం లేదని ఐటీ అధికారులు నిర్వహించిన ఈ తనిఖీల్లో ఏకంగా రూ.100 కోట్ల మేరకు లెక్కల్లోకి రాని విలువైన ఆస్తులు వెలుగులోకి వచ్చాయట. ఈ మేరకు రెండురోజులపాటు వరుస తనిఖీలు నిర్వహించిన ఐటీ అధికారులు సదరు ఆస్తులకు సంబంధించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకన్నారని తెలుస్తోంది. ఇందులో రూ. 2 కోట్లు విలువగల నగలు, మరో 2 కోట్లు నగదు సైతం ఉన్నట్టుగా ఆదాయపన్ను శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
మూడురోజుల క్రితం ఇళయదళపతి విజయ్, సంచనల నటి నయన తార, చెన్నై చిన్నది సమంతలతో పాటు నిర్మాతలు సెల్వకుమార్, సిబుతామీన్స్, కలైపులి థాను, మదురై అన్బు, దర్శకులు శింబుదేవన్, అన్బుసెలియన్, విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్, పులి చిత్రంతో ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్న వారి ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయ పన్ను శాఖ వర్గాలు కన్నెర్ర చేసిన విషయం తెలిసిందే. బుధ, గురు వారాల్లో 400 మంది అధికారులు 35 చోట్ల తనిఖీలు చేశారు. చెన్నై, హైదరాబాద్, మదురై, కోయంబత్తూరు, కొచ్చిన్, తిరువనంతపురం తదితర 35 చోట్ల పలు సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలు, ఫామ్ హౌసుల్లో రెండు రోజులపాటు సాగిన ఈ తనిఖీల్లో వంద కోట్ల మేరకు లెక్కల్లోకి రాని నగలు, నగదు, ఆస్తుల రికార్డులు, పత్రాలు బయట పడ్డట్టుగా సమాచారం.
అయితే, ఈ లెక్కలోకి రాని నగదు, నగలు, ఆస్తుల వివరాలు ఎవరి ఇళ్లల్లో, ఎక్కడ లభించిందోనన్న విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచే పనిలో ఆదాయపన్ను శాఖ వర్గాలు ఉన్నట్టు సమాచారం. ఈ ఆస్తులకు సంబంధించి సదు నటులు, సినీ ప్రముఖులు పన్ను చెల్లించారా? లేదా? అనే కోణంలో ఐటీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రూ. 30 కోట్ల మేరకు పన్ను ఎగవేత దిశగా వ్యవహరించి ఉన్న పది మందికి జరిమానా విధించేందుకు కసరత్తులు జరుగుతున్నట్టు తెలిసింది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more