సోషల్ మీడియా వల్ల సామాజిక అడ్డుగోడలు తొలగిపోతున్నాయని భారత ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ అన్నారు. సిలికాన్ వ్యాలీలో ప్రముఖ సంస్థల సీఈవోలతో ఆయన సమావేశమయ్యారు. యాపిల్, మైక్రోసాప్ట్, గూగుల్ సహా ప్రముఖ సంస్థల సీఈవోలు ప్రధానితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ గూగుల్ సహకారంతో 500 రైల్వేస్టేషన్లలో ఉచితవైఫై సదుపాయం కల్పించామని, జనసమర్థ ప్రాంతాలు, పాఠశాలలు, కళాశాలలను వైఫైతో అనుసంధానం చేస్తామన్నారు. స్మార్ట్ సిటీల ఏర్పాటుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగిస్తామని ఆయన తెలిపారు. డిజిటల్ ఎకనామీలో భారత్-అమెరికా భాగస్వామ్యానికి ఈ వేదిక నిదర్శనమని మోదీ వ్యాఖ్యానించారు. కాలిఫోర్నియాలో ఇంతమంది సీఈవోల సమావేశం కొత్త ఆవిష్కరణకు తెరతీయనుందన్నారు. కొత్త ప్రపంచంలో ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్ట్రాగ్రామ్ మన ఇరుగుపొరుగులాంటివని, ఇంటర్నెట్ వల్ల వేగమైన, ఉత్తమ పాలన అందించగలుగుతున్నామని ఆయన వ్యాఖ్యానించారు.
మైక్రోసాప్ట్ సీఈవో సత్య నాదెళ్ల మాట్లాడుతూ భారత్లో గ్రామీణ ప్రాంతాల్లో స్కైప్ ద్వారా తరగతులు నిర్వహిస్తామని, శ్రీకాకుళం జిల్లాలోని స్కూల్లో స్కైప్ ద్వారా తరగతులు నిర్వహించటం అద్భుతమన్నారు. గ్రామాలకు తక్కువ ఖర్చుతో బ్రాడ్ బాండ్ సదుపాయం కల్పించాలని, ఏపీలో డ్రాపవుట్స్ వివరాలు తెలుసుకునేందుకు టెక్నాలజీని వినియోగిస్తున్నారని, చిన్న వ్యాపారులకు క్లౌడ్ కంప్యూటింగ్ ఉపయోగపడుతుందని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. క్వాల్కామ్ సీఈవో పాల్ జాకబ్స్ మాట్లాడుతూ డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియాలో భాగస్వామ్యం అవుతామని అన్నారు. స్మార్ట్ ఫోన్ల వినియోగంలో భారత్ అతిపెద్ద మార్కెట్ అని అన్నారు. భారత అభివృద్ధికి మోదీ రాయబారి అని సిస్కో సీఈవో పేర్కొన్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more