నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు సంబందించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. నేతాజీ గురించి పశ్చిమబెంగాల్ ప్రభుత్వం బయటపెట్టిన పలు ఫైళ్లలో కీలక సమాచారం ఉంది. ఎంతో కాలంగా నేతాజీ మరణం మీద భారత సర్కార్ వద్ద ఉన్న సమాచారాన్ని వెల్లడించాలని సుభాష్ చంద్రబోస్ వారసులు డిమాండ్ చేస్తున్నారు. అయితే రకరకాల కారణాలతో బోస్ మిస్టరీ మీద ఎలాంటి ఆధారాలను, ఫైళ్లను బయటపెట్టలేదు. తాజాగా మోదీని కలిసిన బోస వారసులు ప్రభుత్వం నుండి బోస్ వివరాల వెల్లడికి హామీ పొందారు.
అంతకు ముందే సుభాష్ చంద్రబోస్ కు సంబందించిన ఫైళ్లను పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టేసింది. మమతా బెనర్జీ బోస్ కు సంబందించిన ఫైళ్లను బహిర్గతం చేసింది. అయితే అందులో నెహ్రూ, నేతాజీకి సంబందించిన కీలక సమాచారం బయటకు వచ్చింది. అందులో నేతాజీ వాళ్ల అన్న గురించి కూడా సమాచారం ఉండటం విశేషం.
Also Read : నేతాజీ మిస్టరీపై ఆ 64 ఫైళ్లు
Also Read : నేతాజీ సుభాష్ చంద్రబోసే... గుమ్నమి బాబా
నేతాజీ సుభాష్ చంద్రబోస్ మీద తర్వాత అతని వారసుల మీద నాటి ప్రధాని నెహ్రూ నిఘా ఉంచారు అన్న విషయం తేలిపోయింది. నెహ్రూ తన రాజకీయ ప్రయోజనాల కోసం అలా చేసి ఉంటారు అని అందరూ అనుకుంటున్నారు. అయితే నెహ్రూ, నాటి బ్రిటిష్ ప్రభుత్వం కూడా నేతాజీ కన్నా వాళ్ల అన్నయ్య శరత్ చంద్రబోస్ గురించే ఎక్కువగా భయపడిందట. అప్పటి బ్రిటీష్ అధికారలు రాసిన ఓ లెటర్ ఈ విషయం తెలిసింది. నేతాజీ కన్నా శరత్ చంద్రబోస్ ఎంతో డేంజర్ అని... బ్రిటిష్ ప్రభుత్వానికి ఎన్నకైనా ముప్పు తెస్తాడని ఆ లెటర్ లో ఉంది. అయితే స్వాతంత్రం తర్వాత నెహ్రూ ప్రధాని అయ్యారు. నేతాజీ అన్న శరత్ చంద్రబోస్ ఇండిపెండెంట్ గా కాంగ్రెస్ అభ్యర్థి మీద గెలిచారు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏకంగా ప్రభుత్వాన్నే కూల్చాలని అనుకున్నారట. దాంతో నెహ్రూ చంద్రబోస్ కుటుంబం మీద నిఘా ఉంచింది అని అనుకుంటున్నారు. మొత్తానికి నేతాజీకి సంబందించిన ఫైళ్లలో నేతాజీ అన్న శరత్ చంద్రబోస్ గురించి కూడా ఉండటం విశేషమే.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more