రైతుల ఆత్మహత్యల మీద అందరూ చలించిపోతున్నారు. మనకు తిండి పెట్టే.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మనం ఏమీ చెయ్యలేమా..? దేవుడు మనకు ఎంతో కొంత ఇచ్చాడు.. మన వల్ల రైతులకు ఎంత వరకు చెయ్యగలుగుతామో అంత చేద్దాం అంటూ కొంత మంది ప్రముఖులు ముందుకు వస్తున్నారు. మహారాష్ట్రలోని రైతులను నటుడు నానా పాటేకర్ తనవంతు ఆర్థిక సహాయం చేసి.. వారికి దైర్యాన్ని చెప్పారు. అయితే తాజాగా మరో హీరో అసలైన హీరోయిజం వెలుగులోకి వచ్చింది. హిందీ సినిమా ఇండస్ట్రీలో వేగంగా సినిమాలు చేస్తూ... స్పీడ్ రాకెట్ అని పేరుతెచ్చుకున్న అక్షయ్ కుమార్ కూడా తన ఉదారతను ప్రదర్శించారు. తాను చేసిన దాన్ని అందరి ముందు చెప్పకుండా సైలెంట్ గా తన వరకు సేవ చేసేస్తున్నారు.
కరువు కోరల్లో చిక్కుకున్న మహారాష్ట్రలోని అన్నదాతలకు అండగా అక్షయ్ నిలిచారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు అండగా నిలబడ్డారు. అయితే, మిగతా సెలబ్రెటీల్లా, కొంత మొత్తం చేతిలో పెట్టి ఆయన ఊరుకోవడం లేదు. దానితోపాటు.. నెలవారీగా కూడా బాధిత కుటుంబాలను అక్షయ్ ఆదుకొంటున్నారు. కుటుంబానికి 50 వేలు నుంచి లక్ష దాకా..ప్రతి నెలా పంపుతున్నారని అక్షయ్ సన్నిహితులు చెబుతున్నారు. ఇలా నాలుగు నెలలుగా పంపిణీ చేస్తున్నారట. దీనికోసం ఆయన ఎన్జీవోలపై ఆధారపడటం లేదు. సొంత బృందాన్ని ఏర్పాటు చేసుకొన్నారు. మహారాష్ట్ర పరిధిలో ఈ బృందం తిరుగుతూ, అత్యవసరంగా సాయం అవసరమైన కుటుంబాలను ఎంపిక చేస్తుంది. ఇలా ఇప్పటిదాకా ముప్ఫై కుటుంబాలను గుర్తించినట్టు, వారందరికీ ప్రతి నెలా అక్షయ్ నుంచి సాయం అందుతున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దాదాపు 180 కుటుంబాలకు సాయం అందించాలని ఆయన ఆలోచన చేస్తున్నారట. ఆత్మహత్య చేసుకొన్న రైతు కుటుంబాల కోసం.. తన వైపు నుంచి ఏకమొత్తంగా 90 లక్షలను విరాళంగా అక్షయ్ అందించారు. ఇలాంటి హీరోలు రైతులకు బాసటగా నిలవడం నిజంగా ఆదర్శం. అక్షయ్ కుమార్ ఇలాంటి సేవ కార్యక్రమాలను మరిన్ని చెయ్యాలని మనసారా కోరుకుంటున్నాం..
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more