సామాజిక మాధ్యమాల ద్వారా కొన్ని బంధాలు వికటిస్తుంటే.. మరికొన్ని కొత్త పరిచయాలు అన్యోన్య సంబంధానికి నాంది పలుకుతున్నాయి. కానీ.. ఈ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ల ద్వారా అయ్యే కొత్త పరిచయాలు పెడదారి పడుతున్నాయి. ప్రేమ పేరుతో మోసాలు చేయడం, ఇంకా ఇతర దుశ్చర్యలకు పాల్పడటం వంటి ఘటనలకూ ఈ సామాజిక మాధ్యమాలు కేంద్రబిందువుగా నిలుస్తున్నాయి. ఇప్పటికే ఇందుకు నిదర్శనంగా ఎన్నో సంఘటనలు జరగగా.. తాజాగా మరో సంచలన ఘటన చోటు చేసుకుంది. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన యువతిని ప్రేమించిన యువకుడు తనకి దక్కకపోవడంతో.. ఆ యువతి ఇంటిముందే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన పవన్కుమార్కు ఫేస్బుక్ ద్వారా కోవూరుకు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. మూడేళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నారు. పవన్కుమార్ కోవూరు వచ్చి ఆ యువతిని కలసివెళ్లేవాడు. ఈ క్రమంలో వీరి ప్రేమ వ్యవహారం యువతి కుటుంబసభ్యులకు తెలియడంతో పెళ్లికి ససేమిరా అన్నారు. పరిస్థితి చెయ్యి దాటకముందు మరో యువకుడితో ఆమెకు వివాహ నిశ్చితార్థం జరిపించారు. ఈ విషయం తెలుసుకున్న పవన్కుమార్.. రెండు రోజుల కిందట తన తల్లి, సోదరితో కలసి కోవూరు వచ్చాడు. ఆ యువతి తల్లిదండ్రులను పెళ్లికి ఒప్పించేందుకు ప్రయత్నం చేశాడు. కానీ.. వారు నిరాకరించారు. అతడు ప్రేమించిన యువతి కూడా తనను మరిచిపోవాలని అతనికి సూచించింది.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన పవన్.. ఆమె ఇంటి ముందే పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధిత కుటుంబసభ్యులు వెంటనే పవన్కుమార్ను నెల్లూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more