టీవీల్లో వచ్చే డిబేట్ లు ఏ స్టేజ్ కు వెళ్లాయో అందరికి తెలుసు.. జర్నలిజం పేరుతో మాటల తగాదాకు తెర తీసే డిబేట్ లు ఎంత పాపులరో కూడా తెలుసు. అయితే అంతకు మించి అన్నట్లు నిన్నటి దాకా తిట్టుకుంటూ సాగిన డిబేట్ లు ఇక కొట్టుకునే దాకా వెళ్లాయి. తాజాగా ఐబిఎస్7 చానల్ లో జరిగిన చర్చా కార్యక్రమంలో వచ్చిన వక్తలు కొట్టుకున్న సీన్ చూసి అందరూ షాక్ కు గురయ్యారు. టీవీల్లో మరికొద్దిసేపట్లో కొట్టుకుంటారా అన్నట్లు సాగే ఉత్కంఠ.. నిన్నటి దాకా అయితే ఎక్కడా హద్దులు దాటలేదు. కానీ తాజాగా అది కూడా అయిపోయింది. టీవీలో మాట్లాడటానికి పిలిచిన వాళ్లు.. మాట్లాడటమే కాకుండా ఏకంగా కొట్టుకున్నారు.
ఐబీఎన్7 చానల్లో వివాదాస్పద సన్యాసిని రాధేమాపై జరిగిన ఒక లైవ్ చర్చా కార్యక్రమంలో.. ఓ సాధువు, మరో మహిళా జ్యోతిష్కురాలు నిజంగానే కొట్టేసుకున్నారు. ‘రాధేమాను విమర్శించే ముందు మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవాలి’.. అని ఓమ్జీ అనడంతో చర్చలో పాల్గొన్న జ్యోతిష్కురాలు రాఖీ భాయ్ నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆయన.. ‘నేను మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు. (చర్చలో పాల్గొన్న మరో జ్యోతిష్కురాలు) దీపా శర్మ గురించి మాట్లాడాను’ అన్నారు. దీంతో.. ‘ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడండి’ అని దీపా శర్మ ఆయన్ను హెచ్చరించారు. అయినా ఆయన తన వాదన కొనసాగించడంతో ఆమె ఆగ్రహంగా తానున్న చోటు నుంచి లేచి వెళ్లి ఓమ్ జీ చెంప ఛెళ్లుమనిపించారు. ఆయన కూడా ఏ మాత్రం తగ్గకుండా ఆవిడ చెంప ఛెళ్లుమనిపించారు. ఇద్దరూ కొట్టుకుంటుండడంతో యాంకర్, రాఖీభాయ్ వారిని ఆపే ప్రయత్నం చేశారు. మొత్తానికి మ్యానర్స్ మరిచి వచ్చిన వక్తలు ఇలా కొట్టుకోవడం నిజంగా సిగ్గుచేటు. ఇలాంటి ఘటన దాకా తీసుకువచ్చిన టీవీ ఛానల్ ది కూడా తప్పుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more