తండ్రి బాటలోనే పయనిస్తున్నారు టీడీపీ యువనేత, కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ నారా లోకేష్. సీఎం చంద్రబాబునాయుడు వారంలో ఏడు రోజులు ఏపీలోనే ఉండాలని నిర్ణయించుకుని ఇప్పటికే అక్కడికి మకాం మార్చారు. ఇప్పుడు ఆయన తనయుడు లోకేష్ కూడా..నెలలో 15 రోజుల పాటు ఏపీలోనే ఉండేందుకు సిద్ధమవుతున్నారు. లోకేష్ కోసం గుంటూరులో పార్టీ కార్యాలయాన్ని సకల హంగులతో రెడీ చేస్తున్నాయి పార్టీ శ్రేణులు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఛాలెంజ్ గా తీసుకున్న సీఎం చంద్రబాబునాయుడు..ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను వదిలిపెట్టి వారంలో 7 రోజులు ఏపీలోనే ఉండాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అందుకోసం ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. తండ్రి అడుగుజాడల్లోనే అడుగు వేస్తున్న లోకేశ్.. ఈ నేపథ్యంలోనే గుంటూరుకు తరలుతున్నారు. పార్టీని సంస్థాగతంగా బలపర్చేందుకు.. నెలలో 15 రోజులు ఏపీలోనే ఉండేందుకు లోకేష్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే గుంటూరు జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ భవన్ ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తాత్కాలిక కార్యాలయంగా మార్చేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇకపై లోకేష్ అక్కడి నుంచే పార్టీ కార్యక్రమాలపై సమీక్షలు నిర్వహించనున్నారు.
మరోవైపు ఇన్ని రోజులు పార్టీకి సంబంధించిన..ప్రతి చిన్న విషయానికి హైదరాబాద్ కు తరలివెళ్లాల్సి వచ్చేది. ఇకపై పార్టీ అధినాయకత్వం తమకు అందుబాటులో ఉంటుందని తెలిసి కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాజధాని ప్రాంతంలోని లింగమనేని గెస్ట్ హౌస్ లో సీఎం చంద్రబాబునాయుడు గృహ ప్రవేశం చేశారు. ఈ నేపథ్యంలోనే లోకేష్ కూడా ఈ నెల చివరి నుంచి గుంటూరు పార్టీ కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు. మొత్తానికి పార్టీ అధినాయకత్వం ఒక్కొక్కరుగా రాజధాని ప్రాంతానికి తరలివస్తుండటంతో..ఆంధ్రప్రదేశ్ టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. పార్టీ కార్యకలాపాలను మరింత ముమ్మరం చేసేందుకు రెడీ అవుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more