అతడో సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. చూడ్డానికి చాలా సాఫ్ట్ గా, కూల్ గా వుంటాడు. అందరితోనూ సఖ్యతగా వ్యవహరించే వ్యక్తిత్వం కలవాడు. కానీ.. ఆ వినయం వెనుక ఓ రాక్షసుడు కూడా దాగి వున్నాడని విషయాన్ని ఎవరూ పసిగట్టలేకపోయారు. అతగానిలో ఎంత క్రూరత్వం దాగివుందంటే.. తన ప్రియురాల్ని దక్కించుకోవడానికి ప్రేమించిన తన భార్యనే కడతేర్చాడు. అంతేకాదు.. తన ప్రియురాలి భర్తను ‘ఐఎస్ఐఎస్’ ఉగ్రవాదిగా ముద్ర వేయడానికి పెద్ద కుట్రే పన్నాడు. విమానాల్లో బాంబులున్నాయని ఫేస్ మెసేజ్ లు పెట్టాడు. కానీ.. చివరికి పోలీసులకు చిక్కి జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన ఎంజీ గోకుల్ (37) అనే వ్యక్తి ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఢిల్లీలో పనిచేస్తున్న సమయంలో ఇతనికి ఫేస్ బుక్ ద్వారా అనూరాధ అనే అమ్మాయి పరిచయం అయింది. అది ప్రేమగా మారి, చివరికి పెళ్లిదాకా వెళ్లింది. వీరికి ఓ కుమార్తె కూడా వుంది. వీరిద్దరి జీవితం సుఖసంతోషాలతో గడిచింది. కానీ.. గోకుల్ ను బెంగళూరుకు బదిలీ చేయడంతో సమస్యలు వచ్చిపడ్డాయి. అనురాధ తనతోపాటు బెంగుళూరు రాలేనని తేల్చి చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో బెంగళూరులోనే ఉంటున్న గోకుల్ కు తన చిన్ననాటి స్నేహితురాలు శిజు జోష్ కనిపించింది. ఆమెకు దగ్గరయ్యాడు. అంతేకాదు.. ఆమెను ప్రేమించడంతోపాటు తనతోపాటు వచ్చేయాల్సిందిగా ఆమెను ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. అయితే.. తన భర్తను వదిలి వచ్చేందుకు శిజు ఇష్టపడలేదు. తాను తన భర్తతో సంతోషంగానే వున్నానని శిజు చెప్పడంతో తీవ్ర ఆగ్రహావేశానికి గురైన గోకుల్.. ఆమెను దక్కించుకోవడానికి కుట్ర చేశాడు. ఆమె భర్తను బాంబు కేసులో ఇరికించాలని ప్లాన్ వేశాడు.
తొలుత అతని పాస్ పోర్టు జిరాక్స్ సంపాదించి.. ఓ నకిలీ సిమ్ తీసుకున్నాడు. ఆ సిమ్ ద్వారా బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులకు ఫోన్ చేశాడు. వాళ్లు లిఫ్ట్ చేయకపోవడంతో ఢిల్లీ విమానాశ్రయానికి ఫోన్ చేసి, ఎయిర్ పోర్టులో బాంబులున్నాయంటూ అబద్ధం చెప్పాడు. అనంతరం బెంగుళూరు విమానాశ్రయానికి ‘వాట్సప్’ ద్వారా బాంబులున్నాయని తప్పుడు బెదిరింపు సందేశాలు పంపాడు. ఈ సమాచారం అందుకున్న బెంగళూరు నేర నియంత్రణ విభాగం (సీసీబీ) తమదైన శైలిలో దర్యాప్తు చేయగా.. ఆ సందేశాలు అసత్యమని నిర్ధారించింది. విచారణ మొదలు పెట్టి, ఇదంతా గోకుల్ పనేనని తేల్చింది. ఈ విచారణలో భాగంగానే గోకుల్ చేసిన మరో భయంకర దారుణం వెలుగుచూసింది. ఆగస్టు 28న తన భార్య అనురాధ చేత మద్యం తాగించి, బలమైన వస్తువుతో కొట్టి చంపేశాడు. ఆపై తలకు దెబ్బ తగిలి చనిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. ఇప్పుడా కేసును తిరగదోడే పనిలో పోలీసులు ఉన్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more