మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసు నీరుగారుతుందా..? అంటే అవుననే సమాధానాలే వ్యక్తమవుతున్నాయి. అమాయిక బాలికపై అత్యాచారం జరిగితే న్యాయం చేయాల్సిన ప్రజాప్రతినిధులే.. కేనును నీరుగార్చేందుకు యత్నిస్తున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. ఇలాంటి నేతల ద్వారా కేసు నుంచి బయటకు వచ్చే నిందితులు.. డబ్బుంటే చాలు.. ఏం చేసినా చెల్లుతుందని భావించి.. భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో అఘాయిత్యాలకు పాల్పడతారనేది మాత్రం చెప్పక తప్పదు. ఇక అత్యాచారానికి గురైన అమ్మాయి తమ బంధువులో, లేక సన్నిహితుల కూతురో, సోదరో, పరిచయస్థుల అమ్మాయి అయితే విభిన్నంగా వ్యవహరించే నేతలు.. తమవారు కాదని తెలియగానే డీల్ కుదుర్చుకుని కేసును నీరుగారుస్తారా..? అంటే ప్రసుత్త పరిణామాలను చూస్తే ఎలా కాదని చెప్పగలం.
అత్యాచారా కేసులో, విజయవాడ పోలీసుల అదుపులో వున్న గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన నలుగురు క్రికెట్ బుకీలను బయటకు తీసుకువచ్చేందుకు అక్షరాల యాబై లక్షల రూపాయల డీల్ కుదిరిందన్న వార్తులు వినబడుతున్నాయి. వీరితో పాటు ఈ కేసులో నిందితులుగా వుంటూ అజ్ఞాతంలోకి వెళ్లిన మరో ఐదుగురు బుకీలను కూడా బయటకు తీసుకువచ్చేందుకు డీల్ కుదిరిందని సమాచారం. గుంటూరు జిల్లాకు చెందిన ఓ ముఖ్యనేత తనయుడు.. నిందితులతో డీల్ కుదుర్చుకున్నట్లు తెలిసింది.
క్రికెట్ బుకీల వద్దకు మైనర్ బాలికను పంపిన బ్రోకర్ను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకుని అతని సెల్ నుంచి వాట్సప్ ద్వారా 32 మందికి బాలిక ఫొటోలు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు వారిందరినీ విచారించేందుకు దర్యాప్తును వేగంవంతం చేశారు. ఈ క్రమంలో పోలీసులు విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. రెండు రోజుల వ్యవధిలో సుమారు 20 మంది వరకూ బాలికను శారీరకంగా అనుభవించినట్టు విచారణలో వెల్లడైనట్టు తెలుస్తోంది. వీరిలో ఎక్కువమంది గుంటూరు జిల్లాకు చెందిన క్రికెట్ బుకీలే కావడం గమనార్హం.
ఈ క్రమంలో నిందితుల బంధువులు తమ వారిని కేసు నుంచి తప్పించాలంటూ ముఖ్య నేత తనయుడిని ఆశ్రయించగా 50 లక్షల రూయాలకు డీల్ కుదుర్చుకున్నట్లు తెలిసింది. అడ్వాన్స్గా రూ.10 లక్షలు తీసుకున్న ఆయన.. కేసును నీరుగార్చేందుకు అప్పుడే ప్రయత్నాలే మొదలుపెట్టారని తెలుస్తుంది. కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులపై ఒత్తిడిని తీసుకువస్తున్నారని సమాచారం. ఈ క్రమంలో శనివారమే తన అనుయాయులను విజయవాడకు పంపినట్లు సమాచారం. పోలీసులపై ఒత్తిడి తేవడంతోపాటు డబ్బులు ముట్టజెప్పి కేసు నుంచి తప్పించాలని చూస్తున్నారు. అలా కుదరని పక్షంలో బాధిత మైనర్ బాలిక కుటుంబసభ్యులపై ఒత్తిడి తీసుకువచ్చి.. వారికి పరిహారంగా కొంత డబ్బు ఇచ్చి కేసుతో నరసరావుపేటకు చెందిన బుకీలకు సంబంధం లేదని చెప్పించాలని చూస్తున్నట్లు తెలిసింది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more