cash for vote scam rocks Andhra pradesh assembly

Leader of the opposition jagan dares chandrababu on cash for vote case

YS jagan on cash for vote, ap assembly session, vote for note, cash for vote, ysrcp adjournment motion, AP assembly session, CM chandrababu naidu, YS Jagan mohan Reddy, Phone tapping, Section 8 in Hyderabad, dhulipalla narendra, chevireddy bhasker reddy, horse riding, voice tapes, forensic lab reports

leader of the opposition in Andhra pradesh assembly YS jagan dares chief minister chandrababu naidi on cash for vote case

ఆ స్వరం ఎవరిదీ..? టీడీపీలో మీకు మించిన బాస్ ఎవరైనా వున్నారా..?

Posted: 09/04/2015 03:44 PM IST
Leader of the opposition jagan dares chandrababu on cash for vote case

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు ఫోన్ చేసినట్టు రుజువు చేస్తే రాజీనామా చేసేందుకు సిద్ధమని, లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజీనామా చేస్తారా..? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. ఓటుకు నోటు కేసులో తన పేరు ఎఫ్ఐఆర్ లో నమోదు కావడంపై చర్చించాలని పట్టుబడితే.. ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తురా అని ప్రశ్నించారు. ఏదైనా సమాచారం సభకు చెబుతున్నామంటే, ఆరోపణలు చేస్తున్నామంటే అందులో నిజాయితీ ఉండాలన్నారు. కేసీఆర్ తో చంద్రబాబు ఎన్నికల పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసిన విషయం మరిచిపోయారా అని నిలదీశారు.

దొంగతనం చేయడం తప్పుకాదని, అది చేస్తుండగా పట్టుకున్న వారిదే తప్పన్నట్టుగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఓటుకు కోట్లు కేసును రెండు రాష్ట్రాల సమస్యగా చిత్రీకరించారని ధ్వజమెత్తారు. ఆడియో టేపుల్లో ఉన్న వాయిస్ చంద్రబాబుది అవునో, కాదో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డిని పంపింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే చెప్పిన తన బాస్ ఎవరని, టీడీపీలో చంద్రబాబును మించిన బాస్ లు ఎవరైనా వున్నారా..? అన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు.

 సీఎం లంచాలు తీసుకుని, ఆ డబ్బును ఎమ్మెల్యేలకు ఇస్తూ పట్టుబడితే ఈ సభలో చర్చ జరగకూడదా? వీడియో, ఆడియో ఆధారాలు ఉన్నా.. చంద్రబాబు పేరు చార్జిషీట్ లో 22 సార్లు ఉన్నా చర్చ జరపారా? కానీ రోజూ నా గురించి ఎవరంటే వాళ్లు మాట్లాడొచ్చా? ఎవరంటే వాళ్లు తిట్టొచ్చా? అక్కడితో ఆగరు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా విడిచిపెట్టకుండా దూషణలు చేస్తారు. మైకు అధికారపక్ష సభ్యులకు ఎక్కువసార్లు వస్తుంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు' అని వైఎస్ జగన్ అన్నారు. ఓటుకు కోట్లు కేసులో సమాధానం చెప్పకుండా చంద్రబాబు తప్పించుకుని తిరుగుతున్నారని అన్నారు. చంద్రబాబు సభలోకి వచ్చి ఎందుకు సమాధానం చెప్పరని నిలదీశారు. ఈ అంశంపై తప్పుదోవ పట్టించేందుకు సభను ఉపయోగించుకుంటున్నారని జగన్ విమర్శించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap assembly session  cash for vote  ysrcp adjournment motion  chandrababu  YS jagan  

Other Articles