బీహార్ లోని గయ జిల్లాలో గెహలూర్ గ్రామానికి చెందిన దళిత కూలీ దశరథ్ మాంఝీ.. 22 ఏళ్ల పాటు నిర్విరామంగా ఓ కొండను తవ్వి గ్రామానికి రోడ్డు వేసి చరిత్ర సృష్టించాడు. ఇతని జీవితగాధ ‘మాంఝీ - ది మౌంటెన్ మేన్’ పేరిట సినిమాగా రూపొందించిన సంగతి కూడా తెలిసిందే! మాంఝీలాగే మరో వ్యక్తి మహారాష్ట్రలో వున్నాడు. అహ్మద్ నగర్ జిల్లా గుండెగాన్ గ్రామానికి చెందిన రాజారాం బావ్ కర్ (84) అనే వ్యక్తి.. 57 ఏళ్లపాటు 7 కొండలను తవ్వి 40 కిలోమీటర్ల రోడ్డును నిర్మించి, సరికొత్త సంచలనం సృష్టించాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజారాం అప్పట్లో ఏడోతరగతి వరకు చదువుకున్నారు. అయితే.. అపారమైన తెలివితేటలు కలిగిన ఈయన.. తన మేధోశక్తితో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించాడు. జిల్లా పరిషత్ పాఠశాలలో 34 ఏళ్లపాటు ఆ ఉద్యోగంలో కొనసాగాడు. సామాజిక స్పృహ కలిగిన రాజారాం తమ గ్రామానికి ఏదో ఒకటి మంచి చేయాలని భావించాడు. ఈ క్రమంలోనే ఓ ఆలోచన తట్టింది. తన గ్రామానికి రోడ్డు మార్గం లేకపోవడంతో దానిని ఎలాగైనా నిర్మించాలని భావించాడు. ఆ రోడ్డు కోసం అధికారులు, నేతల చుట్టూ చాలా కాలంపాటు తిరిగారు. కానీ.. ఎవరూ ఆయన వినతిని పట్టించుకోలేదు. దీంతో ఆయనే గ్రామానికి రోడ్డు వేయడానికి నడుం బిగించారు.
అనుకోవడమే ఆలస్యం.. వెంటనే పనిలో దిగిపోయాడు. రేయింబవళ్లు రోడ్డు నిర్మాణం కోసం కష్టపడ్డాడు. అలా 57 ఏళ్లపాటు ఏడు కొండలను తవ్వి 40 కిలో మీటర్ల రోడ్డును నిర్మించారు. ఇందుకోసం తాను సంపాదించిన మొత్తాన్ని, రిటైర్మెంట్ సందర్భంగా వచ్చిన డబ్బును కూడా ఖర్చుపెట్టడం విశేషం. గతంలో సైకిల్ వెళ్లేందుకు కూడా మార్గంలేని గుండెగాన్ కు ఇప్పుడు పెద్దపెద్ద ట్రక్కులు కూడా వెళ్తున్నాయట. ఇదంతా రాజారాం బావ్ కర్ వల్లే జరిగిందని గ్రామస్థులు చెబుతున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more